కొన్నిసార్లు చాలా విషయాలు నమ్మబుద్ది కావు.అనేక విషయాలు మనకు వింతగా అనిపిస్తుంటాయి.
అయితే ఆవిషయాలు కొన్ని మాత్రమే మనం చూస్తుంటాం.అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరింగింది.
ఓ లైబ్రరీ నుంచి తీసుకున్న ఓ బుక్ ను 50 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే లైబ్రరీకి చేరింది.ఇన్ని సంవత్సరాలు తమ వద్ద ఉంచుకున్నందుకు వారు పెనాల్టి కూడా చెల్లించారు.
ఈ ఘటన ఈశాన్య పెన్సిల్వేనియా లోని ప్లైమౌత్, పా లైబ్రరీలో సంభవించింది.బర్టన్ హాబ్సన్ ఈ బుక్ రాశారు.కాయిన్స్ యు కెన్ కలెక్ట్ అనేది ఈ బుక్ పేరు.1967వ సంవత్సరానికి ఈ బుక్ చెందుతుంది.ఈ బుక్ కాపీ పోయిన నెలలో 20 డాలర్ల ఫైన్ కట్టి లైబ్రరీకి వచ్చింది.
లైబ్రరికి ఈ బుక్ తో పాటుగా సైన్ లేకుండా ఉండే ఓ లెటర్ కూడా వచ్చింది.50 ఏళ్లకు ముందు ఓ బాలిక ఈ బుక్ ను 1971వ సంత్సరంలో తీసుకొచ్చింది.ఆ తర్వాత ఆ బాలికను వారి అమ్మానాన్న వేరే ఊరికి తీసుకెల్లడంతో ఆమె చాలా బాధపడింది.
ఆమె వేరే ఊరికి వెళ్తున్నట్టు తెలీదు.అనేకసార్లు ఆ పుస్తకాన్ని తిరిగి పంపిచేయాలనుకున్నప్పటికీ కుదరలేదు.
వాళ్లు ప్రతి సారీ ఇల్లు, ఊరూ మారుతూ వచ్చారు.ప్రతిసారి కుటుంబీకులు ప్లైమౌత్ బుక్ ప్యాక్ చేశావా అని జోకులు వేసేవారని తెలిపింది.
ఆ తర్వాత తాను 20 డాలర్ల జరిమానాతో బుక్ పంపించేసింది.అయితే ఆ డబ్బు తక్కువేనని కూడా ఆమె చెప్పింది.ఇన్ని విషయాలను పంచుకున్న ఆమె తన పేరును మాత్రం చెప్పకుండా పోయింది.లైబ్రరీ రికార్డులల్లో కూడా ఆమె పేరు కనుగొనలేకపోయారు.త్వరలోనే ఈ బుక్ ను ఆమె పంపిన లెటర్ ను లైబ్రరీ ఎగ్జిబిషన్ లో ఉంచనున్నట్లు తెలియజేశారు.ఆమె నిజాయతీగా ఇన్ని సంవత్సరాలకు పుస్తకాన్ని పంపడం గొప్ప విషయమని లైబ్రరీ వర్గాలు ప్రశంసించాయి.