పెయింటింగ్ అంటే ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉంటారు.కొంతమంది పెయింట్ వేసి డబ్బులు సంపాదిస్తుంటారు.
ఇంకొందరు ఇష్టంగా పెయింటింగ్ వేస్తారు.ప్రస్తుతం ఉన్నకాలంలో ఈ కల చాలా మందిలో తగ్గిపోతూ వస్తోంది.
పెయింటింగ్ వేయడానికి కావాల్సిన కలర్లు, అవసరమైన సామాగ్రీ కొనడానికి డబ్బుల్లేకపోవడం వల్ల చాలా మంది అవస్థలు పడుతుంటారు.అయితే వారు వారి సమస్యను అలానే ఉంచడం లేదు.
పెయింటింగ్ వేయడం కోసం కొత్త దారికి శ్రీకారం చుట్టారు.తమకు ఇష్టమైన కళను చంపుకోలేక కొత్త దారికి బాటలు వేశారు.
కలర్స్ కు బదులుగా మట్టిని వాడి పెయింటింగ్ వేయడం మొదలుపెట్టారు.మట్టితో అద్భుతమైన పెయింటింగ్ ను వేసి తమ ప్రతిభను చాటుతున్నారు.
వాళ్లు వేసేటటువంటి పెయింటింగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ మట్టితో పెయింటింగ్ వేయడం వైరల్ అవుతోంది.
సిరియాకు చెందిన జూలియా అనే మహిళ పెయింటింగ్ వేయడంలో నేర్పరి.ఆమె పెయింటింగ్ కు చాలా మంది ముగ్దులవుతారు.ఆమెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.ఆర్టిస్టు కావడం వల్ల ఆమె పెయింటింగ్ ను వేయకుండా ఉండలేకపోయేది.
అయితే కొన్ని కారణాల రీత్యా ఆమె తన ఇంటిని వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది.అయితే తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ వేయడానికి ఆమె దగ్గర సరిపడా డబ్బులు లేవు.
దీంతో చేసేదేమీ లేకపోవడంతో మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్ వేద్దామని ట్రై చేసి సక్సెస్ అయ్యింది.అద్భుతమైన చిత్రాలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.కళను బతికించుకోవడం కోసం మట్టితో పెయింటింగ్ వేయడం వల్ల చాలా మందికి నచ్చుతోందని ఆమె తెలిపింది.మట్టితో అద్భుతమైన పెయిటింగ్స్ వేసిన జూలియాను ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.జూలియా వేసినటువంటి సాయిల్ పెయింటింగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో జూలియాను అందరూ మెచ్చుకుంటున్నారు.
నెటిజన్లు కళను బతికిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.