బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ గతేడాది జూన్ 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటన జరిగి ఏడాది గడుస్తున్నప్పటికీ.
సుశాంత్ ది ఆత్మహత్యా లేక హత్యా అనేది ఇప్పటి వరకు తేలలేదు.ఈ క్రమంలోనే ఆయన అధికారిక ఫేస్బుక్ ప్రొఫైల్లో పలు మార్పులు వెలుగుచూశాయి.
దాంతో సుశాంత్ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అతని ఫేస్బుక్ ప్రొఫైల్ ని ఎవరు రన్ చేస్తున్నారు? అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సుశాంత్ ఫేస్బుక్ ప్రొఫైల్ గురించి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
సుశాంత్ చనిపోయిన అనంతరం అతని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ని టీమ్ రన్ చేసింది.అతని టీమ్ అభిమానుల కోసం నాలుగైదు సార్లు పోస్టులు పెట్టింది.
సుశాంత్ గురించి ఫ్యాన్స్ కి మరింత సమాచారం తెలిసేలా ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు కూడా వెల్లడించింది.ఇక ఆ తర్వాత టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
ఈ క్రమంలోనే సుశాంత్ ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ మారింది.దాంతో అభిమానులు అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
నిజంగా ఆయన బతికే ఉన్నారా అని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమ ప్రియమైన నటుడు చనిపోయాడని పదేపదే గుర్తుచేసి తమ ఎమోషన్స్ తో ఆడుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు.సుశాంత్ ఫేస్బుక్ డీపీ ఛేంజ్ కాగానే ఒక్క సెకండ్ తాను షాక్ అయ్యానని.అతను మళ్ళీ బతికి వచ్చారని అనుకున్నానని.కానీ ఇదేలా సాధ్యమవుతుందని మరొక అభిమాని ప్రశ్నించాడు.ఈ అకౌంట్ మానిటర్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఫేస్బుక్ డీపీ ఛేంజ్ చేశారు? ప్రొఫైల్ పిక్ మార్చి ఏం చెప్పదలచుకున్నారు? అంటూ ప్రస్తుతం అభిమానులు గోల గోల చేస్తున్నారు.