మనం సాధారణంగా వింత శిశువు జన్మించడం తరుచు వార్తలలో చూస్తూనే ఉంటాం.అచ్చం అలాగే తాజాగా ఒడిశాలో ఒక వింత శిశువు జన్మించాడు ఇటీవల కాలంలో ఒడిశాకు చెందిన ఒక మహిళకు రెండు తలల శిశువు జన్మించిన సంఘటన మరచిపోకముందే అదే రాష్ట్రానికి చెందిన మరో మహిళ కు పంది తలను పోలిక తల, చేప చర్మానికి పోలిన చర్మంతో ఉన్న శిశువు పుట్టాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్ పట్టణ సమీపంలోని బట్టకుమార అనే గ్రామానికి చెందిన 30 సంవత్సరాలు గల మహిళ 8 నెలల గర్భిణీ ఆమెకు తాజాగా తీవ్ర కడుపునొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు బెర్హంపూర్ లోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందజేశారు.
చికిత్సలో భాగంగా గర్భిణీ పరిస్థితి పరీక్షించిన వైద్యులు నెలలు నిండక పోయినా కానీ సిజరింగ్ చేసి ఆ శిశువును బయటకు తీశారు అయితే ఆ శిశువు ఆకారాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఈ క్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇలా శిశువు జన్మించడం అత్యంత అరుదు అని తెలిపారు ఇలాంటి శిశువు జన్మించడానికి గల ముఖ్య కారణం హర్లేక్విన్ ఇక్థియోసిస్ అనే రుగ్మత అని ఆయన తెలిపారు.అలాగే ABCA 12 జన్యువులో జరిగే ఉత్పరివర్తనలే ఇలాంటి శిశువులు జన్మిస్తారు ఆయన తెలిపాడు.
ఇలా ఉండగా ఈ వింత శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ మాత్రం ఆరోగ్యంగా ఉందని, ప్రస్తుతానికి ఆ శిశువుని ఐసీయూలో పెట్టి చికిత్స అందజేసినట్లు హాస్పిటల్ సిబ్బంది వారు తెలుపుతున్నారు.ఇలాంటి వింత శిశువు ఎక్కువకాలం జీవించడం చాలా కష్టమని వైద్యులు పేర్కొంటున్నారు.