శీతాకాలంలో మనదగ్గరే చలి తీవ్రత ఈ విధంగా ఉంటే ఇక కశ్మీర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వేరే చెప్పుకోవాల్సిన పనిలేదు.అవును, తాజాగా కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పగటివేళ భారీగా మంచు కురిసింది.
అది మామ్మూలు మంచు కాదండోయ్ దూది పింజాల్లా అచ్చం పూల వర్షం పడుతున్నట్టు పడింది.దాంతో ఆ మంచును స్థానికులు ఆస్వాదించారు.
పగటివేళ ఒక్కసారిగా కురిసిన మంచుతో అనంతనాగ్ జిల్లాలోని పలు ప్రాంతాలు దూది వెదజల్లినట్లుగా తెల్లగా మారడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చు.
అయితే అదే అనంత్నాగ్ అప్పుడప్పుడు భయానక పరిస్థితులు నెలకొంటాయి.హిమపాతం వలన అప్పుడప్పుడు పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.ఆమధ్య భారీ హిమపాతం వలన అనేకమంది అక్కడ మరణించారు.
గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ సంఘటన చోటుచేసుకుంది.ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దాదాపు 5 మంది మరణించారు.
అదే విధంగా అప్పుడే దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని సింథాన్ పాస్ వద్ద చిక్కుకుపోయిన వ్యక్తులు రక్షించబడ్డారు.సివిల్ పోలీస్, ఆర్మీ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) అధికారుల రెస్క్యూ టీమ్ మంచుతో కప్పబడిన ప్రదేశాలను శోధించి మరీ వారిని రక్షించారు.
అల్పోష్ణస్థితి కారణంగా అక్కడ ఏటా ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి.అయితే ఈ విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూనే వుంటారు.ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలు, లోతైన కొన్ని ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నపుడు ప్రజలు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవసి ఉంటుంది.గత సంవత్సరం అక్టోబర్ 23న అక్కడ భారీ హిమపాతం కారణంగా సదరు దుర్ఘటనలు చోటుచేసున్నాయి.