తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి “ఏం మాయ చేశావే” సినిమాతో పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సమంత.ఆ సినిమాలో నాగార్జున కొడుకు నాగచైతన్య సరసన నటించి సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించే వివాహం చేసుకుని తెలుగింటి అమ్మాయి అయిపోయింది.ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్ లో ‘సామ్ జాం‘ అనే షో ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇది ఇలా ఉండగా మరోవైపు సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది అని అనుకుంటున్నారా.? సమంత తనకు ఎంతో ఇష్టమైన డ్రస్సులను కుట్టించుకొని అవి అందరికీ చూపిస్తూ ఇవన్నీ నేను చాలా ఇష్టపడి వాటిని కుట్టించుకున్నాను అని తెలిపింది.
అయితే వాటిని నేను వేసుకోలేదు అంటూ ఒక వీడియోలు పోస్ట్ చేసింది.
ఇక పోస్ట్ చేసిన వీడియోలో వివిధ సందర్భాలలో ఆమె ధరించాలనుకున్న దుస్తులను ధరించి అభిమానులను ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇక సమంత ఈ మధ్య కాలంలోనే తన క్లాతింగ్ బ్రాండ్ ను ఒకటి స్టార్ట్ చేసిన సంగతి అందరికీ విదితమే.ఇక ఈ క్లాతింగ్ బ్రాండ్ కు కు సమంతానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ తన వంతు ప్రమోషన్స్ చేస్తూ ముందుకు కొనసాగుతోంది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా సాకీ ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ స్టైల్స్, కాస్త ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.
తాజాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఓకే చెప్పిందట.
అలాగే సమంతా, నయనతార కలిసి ఒక చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.ఇది ఇలా ఉండగా తాజాగా సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ఆ వార్త ఏమిటి అంటే.
ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వస్త్ర వ్యాపారం కొనసాగిస్తూ వుండగానే, సమంత మరో వారి వ్యాపారం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.ఇక అతి త్వరలోనే నాగార్జున ఓటిటి సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు, ఇందులో సమంత ఒక కీలక పాత్ర పోషిస్తుందని అర్థమవుతోంది.
అంతే కాకుండా సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.ఈ వెబ్ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవబోతుంది.
.