దేశవ్యాప్తంగా గణనాథుడి ఉత్సవాలు షురూ అయ్యాయి.గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ వరకు అంతటా గణేశుడి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకుగాను రిలయన్స్ రీటైల్కు చెందిన ‘ట్రెండ్స్’ వినూత్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో ‘ట్రెండ్స్ సెల్ఫీ విత్ గణేశ్’ పోటీని అనౌన్స్ చేసింది.
విఘ్నేశ్వరుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ గణేశ్ చతుర్థి పండుగ నుంచి ప్రారంభమైన సెప్టెంబర్ 21 వరకు ఉంటుందని పేర్కొంది.ఇకపోతే ఈ పోటీలో పాల్గొనే వినియోగదారులు ట్రెండ్స్వారికి తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహం వద్ద అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫొటో లేదా సెల్ఫీని ఈ పోటీకి ఎంట్రీగా పంపించాలి.‘ఉత్తమమైన గణేశ్ విగ్రహం అలంకరణ’ గా నిర్ణయించబడిన సెల్ఫీ కి రూ.1,500 విలువ చేసే గిఫ్ట్ ఇస్తారు.ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ట్రెండ్స్నుంచి డిస్కౌంట్ కూపన్ కూడా అందజేస్తారు.
ఈ కూపన్స్ను మీరు మీకు దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి పొందొచ్చు.
ఈ పోటీ గురించిన ప్రకటన, ఇందులో పాల్గొనే పద్ధతి, ఇతర వివరాలను ట్రెండ్స ’ స్టోర్లోనూ మీరు తెలుసుకోవచ్చు.ఈ పోటీలో విజేతలను ఆయా సిటీస్ ఆర్ట్ టీచర్స్ ఎంపిక చేయనున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మరి.మీరు మీ గణేశుడితో దిగిన ఫొటో లేదా సెల్ఫీని ‘ట్రెండ్స్’ వారితో పంచుకోండి.అద్భుతమైన ఆలంకరణతో మీ విఘ్నేశుడు ఉన్నట్లయితే మీకు రూ.1,500 వాల్యుడ్ గిఫ్ట్ లభిస్తుంది.మన దేశంలో గణనాథుడి వేడుకలు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారన్న సంగతి అందరికీ విదితమే.అయితే, కొవిడ్ నిబంధనల నేపథ్యంలో మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.