గడిచిన 35 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్లలు పుట్టుక జరగట్లేదు. ఇకపోతే తాజాగా దేవుడు కరుణించి 35 సంవత్సరాలు దాటిన తర్వాత వారి ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో ఆ అమ్మాయికి పెద్దఎత్తున అందరి దగ్గర నుండి ఆదరణ దక్కింది.
నిజంగా రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఆడపిల్ల పుడితే శాపమని భావించే ఉన్న రోజులలో ఇప్పుడు ఈ సంఘటన జరగడం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది.ఆ పాప వారి గ్రామం రావడానికి కోసం కూడా గ్రామా వాసులు పెద్ద ఎత్తున ఎదురుచూశారు.
ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లా కు చెందిన మదన్ లాల్ కుటుంబంలో సంభవించింది.
మార్చి నెలలో మదన్ లాల్ కొడుకు హనుమాన్ రామ్ జంటకు ఓ ఆడపిల్ల పుట్టింది.
దీంతో 35 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారి కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆ కుటుంబం వారు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఊరంతా సంబరాలు చేశారు.ఈ సందర్భంగా ఆ గ్రామమంతా వేడుకలు చేసుకోవడం మాత్రమే కాకుండా.
ప్రసవం తర్వాత ఆ చిన్నారిని అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చిన్నారి తండ్రి వారు వారికి ఆహ్వానం పలకడానికి పెద్ద ఎత్తున సాంప్రదాయ నృత్యాలు, భజనలు ఏర్పాటు చేశారు.తమ కుటుంబంలోకి అమ్మాయి పుట్టుకను ఓ పెద్ద వేడుకల చేసుకుంటామని అందుకోసం తమ బంధువులందరికీ పిలుపు పంపించామని పాప తండ్రి తెలియజేశాడు.
ఇకపోతే ఆ పాపకు రియా అనే నామకరణం చేశారు.
ఆ పాపను తమ సొంత గ్రామానికి పాప అమ్మమ్మ గారి ఊరు నుంచి ఏకంగా హెలికాప్టర్ లో తీసుకువచ్చి ఘనమైన ఆహ్వానాన్ని పలికారు తండ్రి కుటుంబ సభ్యులు.ఇది వరకు తాము నివసిస్తున్న ప్రాంతం అంతా అమ్మాయి పుట్టడం ఓ శాపంగా భావించేవారని.ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఈ పరిస్థితులు ఇంకా మారాలని.
ఆడపిల్లలు ఇంటికి వరంగా భావించే పరిస్థితి రావాలని రియ తండ్రి చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా ఇప్పటికీ సమాజంలో ఆడపిల్ల పుడితే అడ్డంకిగా భావించే వారి నడుమ ఇలాంటి ఘటన జరగడం నిజంగా అభినందించతగ్గ విషయమే.