ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానున్నది.ఈ నేపథ్యంలోనే ఫ్రాంఛైజీలు తమ జట్లను బాగా ప్రమోట్ చేస్తున్నాయి.
ప్రతి ఫ్రాంఛైజీ కూడా సోషల్ మీడియా వేదికగా వినూత్నమైన ఆలోచనలతో తమ జట్లకు బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి.దీని కోసం తమ జట్టు ఆటగాళ్లను సరికొత్తగా పరిచయం చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఇందులోని భాగంగానే సన్రైజర్స్ హైదరాబాద్ టీం మెంబెర్స్ తెలుగులో మీమ్స్ క్రియేట్ చేసి తమ ఆటగాళ్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత వాసులకు పరిచయం చేస్తున్నారు.
తాజాగా కెప్టెన్ కెన్ విలియమ్స్ పై ఒక మీమ్ తయారుచేసి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ పోస్టులో మహేష్ బాబు హీరోగా నటించిన “భరత్ అనే నేను” సినిమా పోస్టర్ చూడొచ్చు.అయితే ఈ ఫోటోలో మహేష్ బాబు ఒక సూట్కేసు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనపడుతుంది.
అయితే ఈ ఫోటోని ఎడిట్ చేసి మహేష్ బాబు ఫేస్ ప్లేస్ లో కెన్ విలియమ్స్ మొఖం వచ్చేలా చేశారు.అలాగే “కెన్ విలియమ్స్ అనే నేను” అని పోస్టర్ పై రాశారు.
కెన్ విలియమ్స్ అనే నేను వచ్చే ఐపీఎల్ లో మీ ముందుకు వస్తున్నాను అన్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
మార్ఫింగ్ చేసిన ఈ ఫోటోకి “నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని ఒక కాప్షన్ జోడించారు.దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇదేం క్రియేటివిటీ అయ్యా బాబు అని మరికొందరు నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే త్వరలోనే ప్రారంభం కానున్న 2021 ఐపీఎల్ సీజన్ మ్యాచులు రెండు నెలల వరకు క్రీడా అభిమానులు బాగా అలరించనున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కచ్చితంగా ఫైనల్ వరకు చేరుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఆ జట్టు ఆటగాళ్లు ఎంత బాగా ఆడతారో చూడాలి.