క్రికెటర్లు సినీ హీరోయిన్స్ తో ప్రేమాయణంలో మునిగి తేలడం అనేది కొత్త విషయం ఏమి కాదు.ఎందుకంటే మనం ఇంతకుముందే కొంతమంది క్రికెట్లరు, హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్ గురించి వినే ఉంటాము.
ఇందులో కొన్ని జంటలు పెళ్లి కూడా చేసుకున్నాయి.అయితే తాజాగా మళ్ళీ ఇప్పుడు ఒక జంట పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వాళ్ళు మరెవరో కాదు మన టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అలాగే బాలీవుడ్ నటి అథియా శెట్టి.అతియ మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె.
అయితే రాహుల్, అథియా గురించి కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి.గత కొన్నాళ్లుగా లవ్ లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో ఇంగ్లాడ్ టూర్ లో వీరికి సంబందించిన ఫోటోలు బయట పడడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇంగ్లాండ్లో ఉన్నారు.
ప్రస్తుత జట్టులో ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు.ఈ క్రమంలో బీసీసీఐ క్రికెటర్లకు సెలవులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆటగాళ్లు అందరు తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఇంగ్లాండ్ లో టూర్ ప్లాన్ చేసుకుని అక్కడ పర్యటించారు.ఈ టూర్ కి సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.
అయితే టీమ్ ఇండియా ఆటగాళ్లలో ఒకరు అయిన ఇషాంత్ శర్మ భార్య ప్రతిమా సింగ్ సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశారు.అందులో అతియా శెట్టితో పాటు కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు.ఆ ఫోటో చూసాక అందరిలో ఒక క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం ఈ జంట ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ఇంతకు ముందు కేఎల్ రాహుల్ కేవలం తన సోదరుడు అయిన అహన్ తో కలసి ఉన్న ఫొటోను మాత్రమే షేర్ చేశాడు.అంతే కానీ.అతియాతో ఉన్న ఫొటోను మాత్రం షేర్ చేయకపోవడం గమనార్హం.నిజం ఎన్నో రోజులు దాగదు అంటారు కదా.అలాగే కెఎల్ రాహుల్ అతియాతో ఉన్న ఫోటోలు షేర్ చేయకపోయినా ఇషాంత్ శర్మ భార్య ప్రతిమ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలో కేఎల్ రాహుల్, అతియ కలసి ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ ఫొటోలో అతియా సెల్ఫీ తీస్తుండగా కెఎల్ రాహుల్, ప్రతిమా సింగ్, ఇషాంత్ శర్మ, రాజాల్ అరోరా సెల్ఫీకి ఫోజులు ఇస్తూ కెమెరా వంక చూస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు.
దీంతో వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు.ఇప్పటికయినా ఈ జంట అధికారికంగా వారి రిలేషన్ ను ప్రకటిస్తారో లేదో చూడాలి.