కరోనా వచ్చిన తర్వాత మనుషులకు మనుషి చాలా దూరంగా ఉండటం నేర్పింది.ఇది రాక ముందు అయితే ముద్దులు, ముచ్చట్లు అంటూ చాలా రకాల వార్తలు, కబుర్లు సాగేవి.
ఈ వైరస్ పుణ్యమా అని ఇలాంటి ముద్దులు, ముచ్చట్లు రెండూ మర్చిపోయారు జనాలు.మన దేశంలో లిప్ టు లిప్ కిస్ అంటే చాలా పెద్ద విషయంలా చూస్తారు గానీ విదేశాల్లో అయితే ఇది చాలా కామన్.
కాస్త డెవలప్ అయిన దేశాల్లో అయితే ఇలాంటివి పబ్లిక్ గానే చేయడం అక్కడ జీవన విధానంగా మారిపోయింది.అది ప్రేమకు చిహ్నంగా అక్కడి వారు చెప్తుంటారు.
నిజానికి ఇప్పుడున్న దేశాల్లో 46శాతం మంది ఇలాంటి విధానాన్ని అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా హిందూ దేశాల్లో ఇలాంటివి చాలా తక్కువ గానీ ఇతర దేశాల్లో మాత్రం ఇవి బాగానే ఉన్నాయి.
ఇక ఈ ముద్దు పెట్టుకోవడం అంటే చాలా వరకు శృంగారానికి సంబంధించినదిగానే చూస్తారు.కానీ కొన్ని దేశాల్లో ఇది ప్రేమకు చిహ్నంగా వాడుతుంటారు.అందుకే ఎంత వయసు వచ్చినా కూడా ఇలాంటివి చేస్తూ తమ భాగస్వామి మీద తమకు ఉన్న ప్రేమను ఇలా ముద్దు రూపంలో తెలియజేస్తూ ఉంటారు.ఇలాంటి వైరల్ పిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఒక కుటుంబం ఇలా ముద్దు పెట్టుకున్నట్టు ఉంది.ఇందులో నాలుగు తరాల వారు అంటే బామ్మ నుంచి ముని మనవడి దాకా ఇలా భార్యలు, భర్తలతో ముద్దు పెట్టుకున్న రేర్ పిక్ వైరల్ అవుతోంది.అయితే దీనిపై చాలా రకాల స్పందనలు వస్తున్నాయి.ఎందుకంటే ఇప్పుడున్న కరోనా సమయంలో ఇలాంటివి ఆరుబయట చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నెటిజన్లు.ఇంకా కొందరు అయితే ప్రేమను మించిన శక్తి కరోనాకు లేదని, ప్రేమలో మునిగిన ఈ జంటలను వ్యాధులు ఏం చేస్తాయంటూ సెటైర్లు వేస్తున్నారు.