ఈ సృష్టిలో దేనికైనా వెలకట్టగలం గానీ ప్రాణానికి మాత్రం ఎవ్వరూ వెలకట్టలేరు.ఎన్ని కోట్లు ఇచ్చినా, ఏం చేసినా తిరిగి రానిది ప్రాణం ఒక్కటే.
అందుకే దానికి అంత విలువ ఇస్తున్నాం.చిన్న చిన్న పొరపాట్లకు ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి అయ్యో అంటాం.
కానీ అదే మన వరకు వచ్చే సరికి మాత్రం నాకేం కాదులే అన్న ధీమాతో ఉంటాం.ఇదే ధీమాను బైక్ మీద వెళ్లే టప్పుడు కూడా ప్రదర్శిస్తాం.
అందుకే తలకు హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తూ ఉంటాం.అయితే ఇలా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి నిత్యం ఏదో ఒక వార్త వింటున్నాం.
అయినా సరే మనలో మాత్రం మార్పు రాదు.పోలీసులు చెప్పినా మనం మాత్రం వినకుండా అలాగే వెళ్తుంటాం.అయితే హెల్మెట్ పెట్టుకుని పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా ప్రాణాలతో బయట పడ్డ వీడియోలు అనేకం నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.ఇంకొన్ని అయితే కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తున్నాం.
అంటే ఈ ఒక్క వస్తువు మన జీవితాన్ని నిలబెడుతుందని తెలిసినా నిర్లక్ష్యం మాత్రం వీడం.కానీ ఇప్పుడు ఓ వైరల్ పిక్ను చూస్తే మాత్రం ప్రాణం విలువ ఎంత గొప్పదో అర్థమయిపోతుంది.
ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా ఇదే కదా కావాల్సింది అంటూ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు.ఇంతకీ ఇందులో ఏముందంటే ఓ వ్యక్తి, మహిళ ఎక్సెల్ బైక్ మీద వెళ్తున్నారు.హైదరాబాద్ లోని మూసాపేట్ మెట్రో స్టేషన్ దగ్గర్లో వీరు మోపెడ్ మీద వెళ్తుండగా వెనకున్న వారు ఫొటో తీశారు.
ఇందులో చూస్తే బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనకున్న మహిల కూడా హెల్మెట్ పెట్టుకుంది.అంటే బండి చిన్నదైనా సరే ప్రాణం విలువ పెద్దదని వారు చెబుతున్నారన్నమాట.
దీన్ని చూసిన వారంతా కూడా అందరూ ఇలాగే హెల్మెట్ పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు.
.