ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉండటం ద్వారా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా అనేక రకాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మనం గమనిస్తూనే ఉంటాం.
ఇందులో ముఖ్యంగా మనుషుల వీడియోలు కంటే జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇక అసలు విషయంలోకి వెళితే…
సాధారణంగా పాము కనిపిస్తే భయంతో ఆమడ దూరం పరుగెడతాం.
మరి పాము పడగ విప్పితే వళ్ళు జలదరిస్తుంది.గుండె జారి చేతుల్లోకి వచ్చినంత పని అవుతుంది.
ఒకటి కాదు.రెండు కాదు.
ఏకంగా మూడు.నల్ల త్రాచు పాములు ఒకే చోట పడగ విప్పి ఉంటే.పై ప్రాణాలు పైకి పోవాల్సిందే.మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో తీసిన ఫోటోను రాజేంద్ర సెమల్కర్ అనే వ్యక్తి పోస్ట్ చేసారు.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇండియన్ వైల్డ్ లైఫ్ ఫేస్ బుక్ గ్రూపులో ఈ ఫోటో తొలిసారి దర్శనం ఇచ్చింది.
జనవాసాల్లోకి వచ్చిన పాములను రక్షించి అడవుల్లో విడిచి పెట్టిన తరువాత ఈ ఫోటో తీసినట్లు సమాచారం.రాజేంద్ర సెమల్కర్ పోస్ట్ చేసిన ఫొటోస్ లో ఒక దాన్ని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.మూడు నాగు పాములు ఒక సారి మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు” అని క్యాప్షన్ జోడించారు.