అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు, వింతలు జరగడం చాలా కామన్.ఇక ఇలాంటి వింత ఘటనలు ఒకప్పునడు పెద్దగా ఎవరికీ తెలియకపోయేవి.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా అందరికీ కొద్ది గంటల్లోనే తెలిసిపోతోంది.మొన్న ఓ దూడ మూడు కండ్లతో పుట్టిన ఘటన ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక నిన్న ఓ చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఘటన కూడా చూశాం.ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు దేవుండ్లకు సంబంధించిన కొన్ని వింత ఘటనలు కూడా జరుగుతుంటాయి.
కొబ్బరికాయలో దేవుని రూపం కనిపించడం, గుమ్మడి కాయలో వినాయకుడి ప్రతిమ దర్శనం ఇవ్వడం లాంటివి కూడా కనిపిస్తున్నాయి.అయితే ఇలాంటి ఘటనే ఇప్పుడు కూడాచోటుచేసుకుంది.అయితే అది కూడా కొబ్బరికాయలోనే కనిపించింది.అయితే ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ప్రాంతంలో ఉండే వెల్లా మూర్తి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఓ కొబ్బరికాయ కనిపించింది.దీంతో దాన్ని ఆయన తీసుకెళ్లి భార్య నాగ శ్రీవాణికి ఇచ్చారు.
ఆమె దాన్ని స్థానికంగా కొలువై ఉన్న సత్తెమ్మతల్లికి నైవేద్యంగా పెట్టాలనుకుంది.
కాగా ఆమె ఆ ఆలయం దగ్గర కొబ్బరికాయను కొట్టగా అందులో అమ్మవారి రూపంలో ఉన్న రెండు నేత్రాలు కనిపించాయి.దాంతో ఆమె భయపడి వాటిని కింద పడేసింది.రెండు ముక్కల్లో రెండు కండ్లు కనిపించాయి.
దీంతో ఈ విషయం భర్తకు చెప్పగా.అతను కూడా వచ్చిచూశాడు.
అమ్మవారి రూపం ఇలా దర్శనం ఇచ్చిందని భావించి, ఆ కొబ్బరికాయను వారు పూజించడం స్టార్ట్ చేశారు.ఇక అక్కడకు వచ్చిన ఓ మహిలకు అమ్మవారు పూని.
తాను మావుళ్ళమ్మను అని, తనకు దగ్గరలో గుడి కట్టించాలని కోరింది.ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.