షర్మిల ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమె కుటుంబంలో కలహాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.మొదటి నుంచి తన అన్నతో సరిగ్గా పొంతన లేక ఇలా సొంతంగా పార్టీ పెట్టుకుందనే ప్రచారం బాగానే సాగుతోంది.
ఎందుకంటే షర్మిలకు ఆమె సోదరుడు సీఎం వైఎస్ జగన్ సరైన సపోర్టు ఇవ్వట్లేదని అందుకే అందుకే ఇలా తెలంగాణలో పార్టీ పెట్టుకుందని ప్రచారం బాగానే నడుస్తోంది.అయితే షర్మిల ఇలా రాజకీయ ప్రవేశాన్ని ఇచ్చినా కూడా ఆ తర్వాత ఒక్కసారి కూడా సీఎం జగన్ ను కలిసిన దాఖలాలు లేవు.
ఇక అప్పటి నుంచి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు జగన్, షర్మిల ఎప్పుడు కలుస్తారా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇడుపులపాయలో ఈరోజు జరిగిన వైఎస్ఆర్ వర్థంతికి వేరువేరుగానే హాజరవుతారని అనుకున్నారు.
ఎందుకంటే మొన్న జరిగిన జయంతి నాడు కూడా ఇలాగే వేర్వేరుగా హాజరయ్యారు.ఆ కారణంగా ఈరోజు కూడా ఇలాగే వేర్వేరుగా వస్తారని భావించగా అందరికీ షాక్ ఇస్తూ విజయమ్మ అలాగే షర్మిలతో పాటు సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యక్షమయ్యారు.
అయితే ఇక్కడ మాత్రం షర్మిల తన అన్న సీఎం జగన్ పక్కనే కూర్చున్నా కూడా పెదద్గా కలిసినట్టు కనిపించలేదు.ఇద్దరూ కూడా ఎడమొహం, పెడమొహం అన్నట్టుగానే ఎవరికి వారు అన్నట్టు ఉన్నారు.ఇద్దరి హావభావాలు చూస్తే పెద్దగా మాట్లాడుకోకుండానే సైలెంట్ గా నివాళి అర్పించడం కనిపిస్తోంది.అయితే ఇద్దరూ కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద మొక్కే సమయంలో ఎవరి తలలు వారి వైపే తిప్పుకుని నివాళి అర్పించడం కూడా మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
దీంతో ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.