ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14 వ సీజన్ ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక ఐపీఎల్ సీజన్ 14 కోసం అన్ని జట్ల ఆటగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ లో చాలా బిజీ అయిపోయారు.ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 14వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ భారత దేశం లోకి అడుగు పెట్టిన సంగతి సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసాడు.
అయితే సోషల్ మీడియా వేదికగా తెలియచేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వాస్తవానికి ఆ ఫోటోలో గ్లెన్ మ్యాక్స్వెల్ పక్కన ఉన్న యువతి ఎవరా ? అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు.ఇది ఇలా ఉండగా గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మన భారతదేశ అమ్మాయి అయిన విని రామన్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం ఆ ఫోటోలో ఉన్నది విని రామన్ మాత్రం కాదు.
దీనితో గ్లెన్ మ్యాక్స్వెల్ పై సోషల్ మీడియాలో పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
వాస్తవానికి గ్లెన్ మ్యాక్స్వెల్ పక్కన ఉన్న అమ్మాయి నెరోలి మెడోస్.
ఆమె ఒక ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ స్పోర్ట్స్ యాంకర్.ఈమె మన భారతదేశానికి ఐపీఎల్ 14వ సీజన్లో యాంకరింగ్ కోసం తన స్నేహితుడైన మ్యాక్స్వెల్ కలిసి వచ్చింది.
వాస్తవానికి ఆమె ప్రస్తుత ఐపీఎల్ 14వ సీజన్లో యాంకర్ గా వ్యవహరించడం కోసం వచ్చినట్లు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా గత ఏడాది యూఏఈ దేశంలో జరిగిన ఐపీఎల్ సమయంలో కూడా ఆమె యాంకరింగ్ వ్యవహరించింది.
అలాగే గతంలో కూడా ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్ లో యాంకరింగ్ వ్యవహరించింది.అలాగే బిగ్ బాష్ లీగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ లాంటి మ్యాచ్ లలో కూడా యాంకరింగ్ చేసి మంచి అనుభవం కలిగి ఉంది.