ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచడం పరిపాటిగా మారిపోయింది.మన భారతదేశంలో ఈ ప్రక్రియ ఎక్కువ లేకపోయినా.
విదేశాల్లో ఎక్కువగా ఈ జంతువుల పెంపకం కామన్ గా కొనసాగుతూనే ఉంది.సహజంగా ఇళ్ళలో పిల్లులు, కుక్కలను అలాగే కొందరైతే మరికొన్ని జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటారు.
ఇకపోతే జంతువులకు మనం ఎలా నేర్పిస్తే అవి అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి.కొందరు వారు పెంచుకుంటున్న జంతువులతో కలిసి ఫోటోలో దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా తెగ షేర్ చేస్తూ మురిసిపోతుంటారు.
అయితే జంతువులు కూడా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటే అది మర్చిపోవు.అలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు ఓ పిల్లి విషయంలో జరిగింది.అదేమిటంటే…
ఇంటి యజమాని ఎప్పుడు సెల్ఫీ దిగడం గమనించిందో కానీ… ఆ పిల్లి కూడా ఓనర్ లేని సమయంలో స్వయంగా సెల్ఫీలు తీసుకుంది.మామూలుగా ఎక్కడైనా సరే, ఎవరి ఇళ్లలో ఏవైనా జంతువులు ఉంటే వారి ఇంట్లో వెంట్రుకలు కనపడడం సహజమే.
అయితే సదరు పిల్లి యజమాని బయటికి వెళ్లి తిరిగి రాగా తన ట్యాబ్ పై పిల్లి యొక్క వెంట్రుకలు కనిపించాయి.దీంతో తనకి అర్థమైంది.తన పిల్లి టాబ్లెట్ మీద ఏదో చేసిందని.దింతో టాబ్లెట్ ఓపెన్ చేసి చూసింది.
అలా చూసిన ఆవిడకి నిజంగా నమ్మలేని విషయం కనబడింది.అదేమిటంటే తన పెంపుడు పిల్లి ఆ టాబ్లెట్ లో సెల్ఫీ లను దిగిందట.
ప్రస్తుతం ఆ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ గా మారాయి.ఈ సంఘటన మొత్తం చైనా దేశంలో చోటు చేసుకుంది.
ఆ ఫోటోలకు సంబంధించి తన పెంపుడు పిల్లి సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకుందని, అందుకోసం ఫ్లాష్ లైట్ ని కూడా ఉపయోగిస్తుందని తెలియజేసింది సదరు యజమానురాలు.ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ కూడా ఆశర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలకు తెగ స్పందన లభిస్తోంది.మరికొందరు ఈ పిల్లి స్మార్ట్ పిల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.