టీమిండియా జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వారిలో మహేంద్ర సింగ్ ఒకరన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.దీనికి నిదర్శనం అతి తక్కువ వ్యవధిలోనే టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించడంతో పాటు తన కంటూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు మిస్టర్ కూల్ ధోని.
మ్యాచ్ చివరి నిమిషం వరకు క్రీజ్ లో నిలిచి ఓటమి అంచుల దాకా ఉన్న టీమిండియాను గెలిపించగల సత్తా ధోనికి మాత్రమే సొంతమని మనం ఎన్నో మ్యాచులలో తాను ఏంటో నిరూపించుకున్నారు.మహేంద్రసింగ్ ధోని తన కెప్టెన్సీ సారధ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడంతో పాటు ఎనలేని ఆదరణను సొంతం చేసుకున్నాడు.
మిస్టర్ కూల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా ధోని కి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.తన చిన్న వయసులో విద్యార్థిగా ఉన్న సమయంలో స్కూల్ లో దిగిన ఒక గ్రూప్ ఫోటోను ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ గ్రూప్ ఫోటోలో ధోని ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి అంటూ క్యాప్షన్ ను జత చేశారు.దీంతో ఆ ఫోటోకు నెటిజన్స్ స్పందిస్తూ అభిమానులు వారి స్టైల్లో స్పందించారు.
ఇది ఇలా ఉండగా ఐపీఎల్ లో సీఎస్కే టీమ్ జట్టుకు మరో రెండు సంవత్సరాలపాటు కెప్టెన్సీ గా వ్యవహరించినబోతున్నట్లు తాజాగా సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ వారు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.