ప్రపంచంలో ఉన్న చాలామంది వ్యక్తులకు ఏదో ఒక కళ ఉండే ఉంటుంది.సమాజానికి చూపించడానికి ఎన్నో వింత వింత కళలతో ముందుకు వస్తుంటారు.
కొంతమంది మ్యాజిక్ వంటి విన్యాసాలు చేస్తూంటారు.మరికొంతమంది తమ శరీరాలతో విన్యాసాలు చేస్తూంటారు.
ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషయం లో అద్భుతం అనేది ఉంటుంది.కాగా ఇటీవలే వ్యక్తి వివేకానందుని చిత్రాన్ని ఆకుపై వేసిన దృశ్యం అందరిని ఆకట్టుకుంది.
అల్వాల్ కు చెందిన ఓ వ్యక్తి ప్రదీప్.అతను ఓ సూక్ష్మ కళాకారుడుగా పేరొందాడు.కాగా వివేకానంద జయంతి సందర్భంగా ప్రదీప్ ఒక అరుదైన కళ ను ప్రపంచానికి చాటి చూపాలనుకున్నాడు.దీంతో రావి చెట్టు ఆకు పై స్వామి వివకానంద ముఖ చిత్రాన్ని చిత్రీకరించాడు.
కాగా దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.నేటి జనులు ఆ ఫోటో కు విపరీతమైన కామెంట్లను పెడుతున్నారు.అంతే కాకుండా ప్రదీప్ ప్రముఖుల జయంతి,వర్ధంతి ఇతర విశేషాల కు సంబంధించిన విషయం లో వాళ్ళ చిత్రాలను చెట్ల ఆకు లపై చిత్రీకరిస్తాడు.తన నైపుణ్య కళను ప్రపంచానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త దృశ్యాలతో కనువిందు చేస్తాడు.
ఇలా ప్రదీప్ లాంటి ఎంతో మంది కళాకారులు మన దేశం లో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయమే.అంతే కాకుండా మన దేశం లో ఇతర కళాకారులు కూడా ఎంతో మంది ఉన్నారు.
ఈ మధ్య సోషల్ మీడియా లో వాళ్ళు చేస్తున్న విన్యాసాలు తెగ వైరల్ గా మారుతున్నాయి.అంతే కాకుండా టీవి లో కూడా కొన్ని కార్యక్రమాల్లో కళాకారుల విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియా లో కూడా పలు రకాల విన్యాసాలను మనం బాగా చూస్తుంటాము..