దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో అలెర్ట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో సీఎం క్రేజీవాల్ లాక్ డౌన్ వారం రోజుల పాటు ప్రకటించిన తరుణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోమవారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు అమలు చేయడంతో ప్రజలు అందరూ కూడా ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరి నిలబడ్డారు.
ఈ తరుణంలో అధిక సంఖ్యలో లిక్కర్ బాటిల్ లో కొనుగోలు చేసుకుంటున్నారు ప్రజలు ఇలా ఉండగా ఢిల్లీలోని శివపురి గీతా కాలనీ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది మందు బాటిల్ లు కొనుక్కోవడానికి వచ్చిన వారిలో ఒక మహిళ ఉండటం, ఆమె ప్రధాన మీడియాతో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇక ఆమె మీడియాతో తెలిపిన మాటలు విని ఒక్కసారిగా ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.అంతలా ఆమె ఏం మాట్లాడిందని అనుకుంటున్నారా ఇంజక్షన్తో ఉపయోగం లేదు ఆల్కహాల్ సర్వరోగ నివారిణి 35 ఏళ్ల నుంచి తాగుతున్నా ఈ ఇంగ్లీష్ మందులతో ఏం కాదమ్మా ఒక్క పెగ్ తో అన్నీ మాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కరోనా వైరస్ లాక్ డౌన్ అమలు అవుతూ ఉండడంతో చాలా మంది ప్రజలు వైన్ షాపుల ముందు పెద్ద ఎత్తున క్యూ కట్టడం కొనుగోలు చేసుకోవడం రాజధాని హస్తినలో కూడా అనేక ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం ప్రస్తుతం ఒకవైపు కరోనా మహమ్మారి విరుచుకుపడుతూ ఉంటే మరోవైపు షాపుల వద్ద పెద్ద ఎత్తున కొనుక్కోవడానికి జనాలు క్యూ కట్టడం విశేషం.