జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మొదట్లో బొద్దుగా క్యూట్ గా ఉండేవారు.ఆ తర్వాత చాలా సన్నగా తయారయ్యి తన అందాన్ని కోల్పోయారు.
మళ్ళీ కాస్త బరువెక్కి తన ఫిట్నెస్ లెవల్స్ ని పర్ఫెక్ట్ గా మెయిన్టైన్ చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటున్నారు.ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ తన పాత్రలకు నూటికి నూరుశాతం న్యాయం చేసేందుకు కీర్తి సురేష్ శ్రమిస్తున్నారు.
ఆమె నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు.
వెంకీ అట్లూరి రూపొందించిన ఈ చిత్రం మార్చి 26వ తేదీన విడుదల కానున్నది.
మూవీ విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యింది.ఇటీవల చెక్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన నితిన్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
రంగ్ దే సినిమాతో ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలని ఆయన చురుకుగా ప్రచారం చేస్తున్నారు.ఇందులోని భాగంగానే నితిన్, కీర్తి కలిసి ఒక ఫన్నీ వీడియో చేసి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ వీడియోలో నితిన్, కీర్తి ఆహారం ఆరగించడం చూడొచ్చు.
ఈ వీడియో ప్రకారం కీర్తి ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ ఫ్రూట్స్ తింటుండగా నితిన్ ఎంచక్కా పిజ్జా తింటున్నారు.నితిన్ పిజ్జా తింటూ ఎంజాయ్ చేయడం చూసిన కీర్తి కాస్త అసూయ గా ఫీల్ అవుతారు.అప్పుడు నితిన్ కావాలంటే నువ్వు కూడా పిజ్జా తిను అంటూ తినిపించడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ ఆమె డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ఏం వద్దులే అని తనని తాను కంట్రోల్ చేసుకుంటారు.దీంతో నితిన్ పిజ్జా చాలా బాగుంది అంటూ ఆమెను మరింత ఊరిస్తూ తింటారు.
అప్పటికీ కీర్తి చిన్న ముక్క కూడా తినడానికి ఇష్టపడరు.కానీ చివరికి తన ఇంద్రియములను నియంత్రించలేక డైట్ ని బ్రేక్ చేసి మరీ టేస్టీ పిజ్జా మొక్కను దొంగతనంగా తినేస్తారు.
ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మీరు ఇద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు అని కాజల్ అగర్వాల్ కూడా ఈ వీడియో పై కామెంట్ చేశారు.