గతంలో సినిమాలు ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు వినోదం కోసం చూసి వచ్చే వారు.బావుంటే నలుగురు వెళ్లేవారు లేదంటే కామ్గా ఉండేవాళ్లు.
కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.సోషల్ మీడియా వచ్చాక బావున్నా, బాగలేకున్నా కొన్ని రోజులు మాత్రం ఆ సినిమా విశేషాలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి.
వాటిల్లో కొన్ని పాజిటివ్గా, కొన్ని ఫన్నీగా.తాజాగా విడుదలయిన ‘వినయ విధేయ రామ’ చిత్రం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫన్నీగా మారిపోయింది.
ఈ చిత్రంలోని సన్నివేశాలు కొన్ని ప్రస్తుతం కామెడీ పీస్లుగా హల్చల్ చేస్తున్నాయి.
గతంలో సినిమాలో హీరో ఏది చేసినా అబ్బా.వావ్ అంటూ పొగిడేశారు.కానీ ప్రస్తుతం హీరో ఎంత చేయాలో అంత మాత్రమే చేయాలి అని, కొంచెం అతి చేసిన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
రామ్చరణ్ నటించిన ‘వివిఆర్’ చిత్రంలో ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు.ఈ చిత్రంలో చాలా సీన్లు అతిగా, సహజత్వానికి దూరంగా ఉన్నాయి.పాము కరిస్తే మనిషికి బదులు పాము చావడం, హీరో నరికేసిన తలలను పక్షులు ఎత్తుకెల్లడం, ఎయిర్పోర్ట్ కిటికి నుండి దూకడం ఇలా లాజిక్ లేని చాలా సీన్లు ఉన్నాయి.అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చిత్ర యూనిట్పై విమర్శలు వస్తున్నాయి.
దాంతో తాజాగా చిత్ర యూనిట్ అలాంటి సన్నివేశాలను కట్ చేశారు.మల్టిప్లెక్స్లు, కొన్ని బి సెంటర్లలో కూడా ఈ సన్నివేశాలని తొలగించారు.సి సెంటర్లలో మాత్రమే ఆ సీన్స్ ఉన్నాయట.
రామ్చరణ్ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత ఒక మంచి చిత్రంతో వస్తాడని అంతా అనుకున్నారు కానీ మరీ ఇంత దారుణమైన సినిమా చూపిస్తాడని అనుకోలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినబడుతున్నాయి.