సహజంగా మనకు పెళ్లి అంటే.వేదమంత్రాలు, పురోహితులు, ఏడడుగులు, మూడు ముళ్ళు ఇలా అనేక సంప్రదాయాలు పట్టించడం మనం చూస్తూనే ఉంటాం.
ఇలా ఒక్కొక్క కులం వారు ఒక విధంగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.ఎవరి మతానికి అనుగుణంగా ఆ మత పెద్దలు తెలిపిన విధంగా వారు వివాహం చేసుకుంటారు.
ఇప్పుడు మీరు వినే పెళ్లి తంతు మాత్రం చాలా విభిన్నం.ఇంతకీ అంత గొప్పగా వీరు పెళ్లి ఎలా చేసుకున్నారు అని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ సంఘటన గురించి మీరు తెలుసుకోవాల్సిందే.ఇందుకు సంబంధించి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
మధ్యప్రదేశ్ లోని ఖర్ గావ్ లో ఒ వధూవరులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వివాహం చేసుకున్నారు.అవును ఇది నిజం.వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారు జీవితాంతం కలిసి ఉంటామని ఒకరిని విడిచి మరొకరం ఉండము అని ప్రతిజ్ఞ చేశారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఈ తరహా పెళ్లిని ఒక గిరిజన సొసైటీ కి చెందిన వారు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఈ విభిన్నమైన వివాహం భగవాన్ పురా తహశీల్ పరిధిలోని ధబ్లా గ్రామంలో జరిగింది.
అంతేకాదు ఈ వివాహంలో వేదమంత్రాలు చదివే పంతులు గాని, మంత్రాలు కానీ సాంప్రదాయబద్ధంగా 3 ముళ్ళు, 7 అడుగులు ఏవి కూడా లేవు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుని రాజ్యాంగం సాక్షిగా పెళ్ళికొడుకు ఇక్రం అర్సే, పెళ్లి కూతురు నైజా ఇద్దరు కలిసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వివాహం చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా గతంలో కూడా మధ్యప్రదేశ్ కు చెందిన ఒక జంట కూడా ఇదే విధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వివాహం చేసుకున్నట్లు సమాచారం.