ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న మధ్యాహ్నం పూట ఒక పండంటి బిడ్డ పుట్టింది.దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ కూతురు హాట్ టాపిక్ అయ్యింది.2020, ఆగస్టు నెలలో తాము ఒక బిడ్డను ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అనుష్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఆ తర్వాత అనుష్క తన బేబీ బంప్ ని అందరికీ చూపించారు.
అయితే భారతదేశంలో అత్యంత పాపులారిటీ కలిగిన జంట విరాట్-అనుష్క అని చెప్పుకోవచ్చు.
విరాట్ కి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు.
అనుష్క శర్మ కి కూడా భారత దేశ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సాధారణంగా ఇలాంటి పాపులారిటీ ఉన్న దంపతులకు మీడియాలో ఎంత అటెన్షన్ వస్తుందో.
వారి కొడుకు, కూతురు లకు కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతుంది.ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా మీడియాలో స్టార్ కిడ్ అయ్యారు.
ముఖ్యంగా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కి జన్మించిన తైమూర్ అలీ ఖాన్ బాగా పాపులర్ అయ్యారు.ఆయన తుమ్మినా.
దగ్గినా వార్తల్లో నిలుస్తున్నాడు అంటే ఈ బుడ్డోడికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
తైమూర్ ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాడా.ఫోటోలు ఎన్ని తియ్యాలి? అని ఫోటోగ్రాఫర్లు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తారు అంటే అతిశయోక్తి కాదు.అయితే ఇక తైమూర్ అలీఖాన్ పాపులారిటీ తగ్గిపోతోందని.
మీడియా మొత్తం కూడా విరాట్ బిడ్డపైనే ఫోకస్ పెడుతుందని.నెటిజన్లు కూడా తైమూర్ ని గాలికొదిలేసి అనుష్క శర్మ బిడ్డ గురించి మాత్రమే పట్టించుకుంటారని అప్పుడే అందరూ అంటున్నారు.
తైమూర్ పాపులారిటీని తగ్గించడానికి విరాట్ బిడ్డ వచ్చేసిందని ఇంటర్నెట్ లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.తైమూర్ ఎటువంటి అటెన్షన్ దక్కక బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు నెటిజన్లు.
ఇకపోతే విరాట్ కోహ్లీ తన బిడ్డను మీడియాకు ఎక్స్పోజ్ చేస్తారో లేదో చూడాలి.తన కూతురికి కావాల్సిన ప్రైవసీ ఇస్తారో లేక సైఫ్ అలీ ఖాన్ లాగా కాస్త ఫ్రీడమ్ ఇస్తారో చూడాలి.