బుల్లితెర జబర్దస్త్ యాంకర్ అనసూయకు నెటిజన్లకు మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.తాజాగా అనసూయ ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటోనే వివాదానికి కారణమైంది.
నెటిజన్లు అనసూయను ట్రోల్ చేస్తుంటే అనసూయ రివర్స్ లో ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.తాజాగా అనసూయ రెండు జడలు వేసుకోవడంతో పాటు పొట్టి బట్టల్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో తెగ చేయగా అనసూయ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అనసూయ తాను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నానంటూ అనసూయ ఆ ఫోటోను పెట్టారు.కొందరు నెటిజన్లు అనసూయ స్కూల్ బ్యాగ్ వేసుకోవడం మరిచిపోయిందంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అనసూయ ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతుంటే అనసూయకు బాధ లేదా అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే తనను ట్రోల్ చేస్తున్న వాళ్లకు అనసూయ ఘాటుగా సమాధానం ఇచ్చారు.బయట కరోనా వల్ల విషయ పరిస్థితులు నెలకొన్నాయని ఇలాంటి సమయంలో వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నానని అనసూయ పేర్కొన్నారు.అయితే కొందరు నెటిజన్లు మాత్రం అనసూయ సమాధానం విషయంలో సంతృప్తి చెందలేదు.
ప్రస్తుతం ప్రజలకు వినోదం అవసరం లేదని చేయూత మాత్రమే అవసరమని కొందరు నెటిజన్లు అనసూయతో వాదించారు.
అయితే అనసూయపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లకు ఆమె ఫ్యాన్స్ సైతం షాక్ ఇస్తున్నారు.
బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఇలాంటి సమయంలో నువ్వెందుకు ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నావని అనసూయపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.మరోవైపు అనసూయ తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.