పాలమూరు జిల్లా వాసి లక్ష్మణ్ రచించిన.మోహన భోగరాజు ఆలపించిన.‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.డుగ్గు డుగ్గు డుగ్గుని’ పాట యూట్యూబ్ లో దాదాపు నాలుగు కోట్ల వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.అన్ని సోషల్ మాధ్యమాల్లోనూ ట్రెండింగ్ లో నిలుస్తోంది.పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం పాడే ఈ పాట అందరి హృదయాలను దోచేస్తోంది.కొద్ది రోజుల క్రితం మంచిర్యాల పెళ్లికూతురు సాయిశ్రీయ అప్పగింతల సమయంలో తన భర్తను సర్ ప్రైజ్ చేసేందుకు ఈ పాటకు డాన్స్ వేసింది.అయితే ఆమె డాన్స్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వైరల్ అయ్యింది.
దాంతో ప్రతి ఒక్కరు ఈ పాటకు ఆడిపాడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా బుల్లెట్టు బండి పాటకు అదిరిపోయే డాన్స్ వేసి ఆశ్చర్యపరిచారు.
మహబూబాబాద్ జిల్లాలో బుధవారం రోజు ఆమె ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేశారు.పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును ఆశీర్వదించిన తర్వాత ఆమె వధూవరుల తో సహా వారి కుటుంబ సభ్యులతోనూ కలిసి సరదాగా డాన్స్ వేస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.అయితే ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
మీరు ఒక లుక్కు వేయండి.
ఇకపోతే వధువు సాయిశ్రీయ వల్ల జానపద గీతమైన బుల్లెట్టు బండి పాటకు అద్భుతమైన గుర్తింపు రావడంతో ఆమెతో కలిసి ఒక పాట చేయడానికి బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్ ముందుకొచ్చింది.ఈ సంస్థే మోహన భోగరాజు సాంగ్ ను నిర్మించింది.అయితే ఈ సంస్థ తో కలిసి ఒక పాట చేసేందుకు సాయిశ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.