సోషల్ మీడియాలో ఏదైనా కొత్త విషయం అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది.అది నిజమా కాదా అనుకునే లోపే చాలా మంది ఏ మాత్రం నిజ నిర్ధారణ చేసుకోకుండానే చాలా మంది నిజమేనని నమ్మేస్తుంటారు కూడా.
కొన్ని కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసినప్పుడు ఆ వస్తువుకు అత్యంత ప్రాచుర్యం లభిస్తే ఇక ఆ తరహా బ్రాండ్ లకు మరింత సొగసులు అద్ది కొంచెం రేటును పెంచి అమ్మే స్తుంటాయి.అయితే మామూలుగా చెప్పులు అంటే ఎవరి స్థాయిని బట్టి వారు చెప్పుల ధరలను కష్టమర్ల ఇష్టాయిష్టాలను బట్టి కొనుక్కుంటూ ఉంటారు.
చాలా మంది మధ్యతరగతి వారు అత్యంత గరిష్ట ఖరీదు అంటే 1000 రూపాయల నుండి రెండు వేల రూపాయలను బట్టి కొనుక్కుంటూ ఉంటారు.అయితే గుచ్చి సంస్థ ఈ మధ్య క్రోక్స్ లా కనిపించే షూస్ మన దేశంలో ఎంత పెద్దగా పాపులర్ అయిందో మనం చూశాం.
అయితే అచ్చం అటువంటి రీతిలో విడుదల చేసిన షూ స్ బ్రాండ్ కు 40 వేల రూపాయల ధరను నిర్ణయించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారని చెప్పడం కన్నా ఆగ్రహానికి గురయ్యారని చెప్పవచ్చు.నలభై వేల రూపాయలతో చెప్పులు కొనే వారు ఉంటారా ఉండరా అనే విషయాన్ని నిర్ధారించుకోకుండా ఇలా ధరలను నిర్ణయించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.