ఏదైనా కేసు కోర్టులో వాదనకు వచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించిన రిపోర్టులు, కేసు వివరాలన్ని కోర్టుకు సమర్పిoచాలి.అప్పుడు వాటిన్నంటినీ కోర్టు పరిశీలించి కేసును వాయిదా వేయడమో, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమో చేస్తుంటారు.
ఇది సాధారణంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.ఇక అసలు విషయం లోకి వెళ్తే హర్యానాలో రోజూ పోలీసులు చేసే సాధారణ చెకింగ్ లో భాగంగా చేసే వాహన తనిఖీలలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.
వాటిన్నంటినీ పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు.అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టులో ఈ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి.
కోర్టు తీర్పు అనంతరం వాటన్నింటినీ ఒక్కసారిగా అన్నింటినీ ధ్వoసం చేస్తారు.అయితే ఈ కేసు వాదనకు వచ్చే సమయానికి పట్టుబడ్డ 29 వేల లీటర్ల మద్యం ఆయా పోలీస్ స్టేషన్లలో లేదు.
అయితే కోర్టు పోలీసులను మద్యం నిల్వలకు సంబంధించిన వివరాలను అడగగా ఆ మద్యం మొత్తాన్ని ఎలుకలు తాగేసాయని పోలీసులు సమాధానం ఇచ్చారు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఎలుకలు తాగేసాయి అంటే ఎవరూ ఈ కేసులో ఇరుక్కోకుండా జాగ్రత్త పడొచ్చనే ఆలోచనతో ఈ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ తో విరుచుక పడుతున్నారు.
ఎలుకలు మద్యం తాగడమేంటి నాయనా అని నెటిజన్లు రెచ్చిపోతున్నారు.