కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో మనం చూస్తున్నాం.ఒక్కసారిగా అకస్మాత్తుగా బయటపడ్డ ఈ వైరస్ ఎలా ఉద్భవించిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.వ్యాక్సిన్ వచ్చినా కూడా ఏదో ఒక మూల వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది.
అయితే కరోనా ఇప్పటికే గ్రామ గ్రామాన విస్తరించి ఉన్న పరిస్థితి ఉంది.మొన్నటి వరకు మనతో మాట్లాడిన వారు రేపు మనతో మాట్లాడుతారో లేదో అన్నంత దయనీయ పరిస్థితి ఉంది.
అయితే కరోనా పుట్టుక పట్ల ఒక్కొక్కరు ఒక్కొ విధంగా మాట్లాడుతున్నారు.అయితే కరోనాను బ్రహ్మంగారు ముందే చెప్పారని కొందరు కరోనా మొదటి వేవ్ సందర్భంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
దీనిపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జోకులు పేలిన సందర్భాలు ఉన్నాయి.అయితే తాజాగా మరొక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ యూజర్ మార్కో అక్రోట్ అనే వ్యక్తి జూన్ 3, 2013 న త్వరలో త్వరలో కరోనా వైరస్ రానున్నదని తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.అయితే ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే ఇప్పుడు డేట్ మార్చి పోస్ట్ చేశాడని కొంత మంది వ్యాఖ్యానిస్తుండగా, ఈయనకు ఎలా తెలిసి ఉంటుందని కొంత మంది నెటిజన్లు అభిప్రాయ పడితున్నారు.