కోవిడ్ విజృంభణ కొన్ని వందల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది.కరోనాతో జనాలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
కనీసం కుటుంబాలు అత్యక్రియలు కూడా చేయడానికి వీలు లేకుండా మరీ ఘోరమైన పరిస్థితులలో మనుషుల ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది.ఇప్పటివరకు జరిగిన మరణాలు చాలా మట్టుకు శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వలన అత్యవసర సమయంలో ఆసుపత్రులలో ఆక్సీజన్ అందుబాటులో లేకపోవడం వలన ఇక ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి చనిపోతున్న పరిస్థితి ఉంది.
ఇక దేశంలో ఆక్సిజన్ కొరత ఉంది అని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుండి ఆక్సిజన్ అత్యవసరం అయిన రాష్ట్రాలకు ఆక్సీజన్ ను అందించింది.అయితే ఇక కొన్ని కొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ అనేది లేకపోతే మనకు కావాల్సిన వారు క్లిష్ట పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం.
దగ్గరలో ఉంటే తెప్పించడానికి ప్రయత్నిస్తాం.కాని తన స్నేహితుడికి ఆక్సీజన్ అవసరం అని చెప్పి ఎక్కడ ఏ వాహనాలు అందుబాటులో లేకపోతే 24 గంటల్లో1300 కిమీ బైక్ పై ప్రయాణం చేసి మరీ స్నేహితుడికి ఆక్సిజన్ అందుబాటులో ఉంచా రు.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.స్నేహమంటే ఇదే అని నెటిజన్లు ఆ సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
స్నేహితుడు అంటే ఇలాంటి అత్యవసర సమయంలో తోడుండాలని, నువ్వు చేసిన పని గ్రేట్ అంటూ అతనిని నెటిజన్లు అభినందిస్తున్నారు.కరోనా దెబ్బకు అసుపత్రులలో వేల మంది ప్రజలు చికిత్స కోసం చేరుతున్నారు.