కరోనా వైరస్ విజృంభణ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చూపింది.ఎన్నో వేల కుటుంబాలు తమ ఇంటి పెద్దను, కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబాలను మనం ప్రత్యేకంగా చూస్తున్నాం.
అయితే కరోనా విజృంభించడంతో ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.దీంతో అన్ని రకాల పనులకు ఆంక్షలు విధించాయి.
దీంతో పెళ్లిళ్లకు ఇలాంటి ఆంక్షలే విధించాయి ప్రభుత్వాలు.ఇక వరుడు తరపు నుండి ఇరవై మంది, వధువు తరపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.
అయితే ఇప్పుడు కరోనా సమయం కాబట్టి పెళ్లిళ్లు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటూ వినూత్నంగా తమ వివాహాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజాగా ఓ జంట చేసుకున్న వివాహం నెట్టింట వైరల్ గా మారింది.
ఒకప్పుడు జరుగుతున్న వివాహాల తీరు ఒకే రకంగా సాగుతుండేది, ఇప్పుడు వివాహ విధానంలోనే చాలా తేడాలు వచ్చిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పడు కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కేరళ, తమిళనాడు రాష్ట్రాలను వేరు చేసే చిన్నార్ నదిపై ఉన్న వంతెనపై చాలా మంది తమ వివాహాలను జరుపుకుంటున్న పరిస్థితి ఉంది.
ఇటు కరోనా నిబంధనలు పాటిస్తూనే,ఒక చిరకాల స్మృతిలా ఉంటుందని ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి వధూవరులు ఆసక్తి చూపుతున్నారట.