ప్రేమ అనేది ఎవరి మధ్య ఎప్పుడు ఎందుకు కలుగుతుందో చెప్పలేం.ఒక వేళ కొందరికి తమ ప్రేమ అనేది దక్కకపోతే వారు దేనికైనా చేయడానికి తెగిస్తారు.
దీని వల్ల వారి జీవితం జైలు పాలు కూడా కావచ్చు.లేదంటే ప్రాణాలను కూడా తీసుకోవచ్చు.
తాజాగా ఓ వ్యక్తి ఒక హిజ్రాపై మనసు పారేసుకున్నాడు.కొద్ది రోజులు ఆమెతో స్నేహం చేశాడు.
ఆ తర్వాత ఆమె తనను అవాయిడ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.హిజ్రా పట్ల క్రూరంగా ప్రవర్తించి అలజడి రేపాడు.
హిజ్రా ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడికి యత్నించాడు.అక్కడున్న హిజ్రాలు ఆ వ్యక్తిని అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలు దక్కాయి.
గాయాలపాలైన హిజ్రాను వెంటనే హాస్పిటల్ కి తరలించారు.ఆ హిజ్రా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.
ఈ ఘటన వరంగల్ జిల్లాలోని శివనగర్ లో చోటుచేసుకుంది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
శివనర్ లో సాయి ప్రియ అనే హిజ్రా నివాసం ఉంటోంది.
గీసుకొండ మండల వ్యక్తి అయిన మహమ్మద్ అబ్బు ఆ హిజ్రాతో చాలా రోజుల నుంచి చనువుగా ఉన్నాడు.సాయి ప్రియతో లవ్ లో పడ్డాడు.కొన్ని రోజులు వీల్లు అన్యోన్యంగా ఉన్నారు.అలా ఉండగా కొన్ని రోజులకు వారిద్దరి మధ్య డబ్బులకు సంబంధించి వాగ్వివాదాలు చోటుచేసుకునేవి.
దీంతో సాయిప్రియ అబ్బును దూరం పెట్టి తన పని తాను చేసుకునేది.ఆ హిజ్రాపైన అబ్బు కోపం పెంచుకున్నాడు.
గత రాత్రి ఆగ్రహంతో ఊగిపోయి ఆమె ఇంటి పైకి కత్తితో వెళ్లాడు.కత్తితో ఆమెపై దాడి చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి హిజ్రాలు ఆ ప్రాంతానికి చేరుకుని సాయి ప్రియ ప్రాణాలను కాపాడారు.
ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.పోలీసులు అక్కడికి చేరుకునేలోపు అబ్బు పరారయ్యాడు.
అబ్బు హిజ్రాలను ప్రేమించినట్లు నటించి వారి వద్ద డబ్బులు తీసుకునేవాడని, వారిని అనేక ఇబ్బందులకు గురిచేసేవాడని తోటి హిజ్రాలు ఆరోపణ చేశారు.ప్రస్తుతం అతనిపై కేసు నమోదైంది.
పోలీసులు అబ్బు కోసం గాలిస్తున్నారు.