నేటి కాలంలో మానవత్వం మంటగలసిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.ఎవరైనా ఏదో ఒక పని చేయాల్సిందే.
అయితే అందరూ ఉన్నత స్థాయి పని మాత్రమే చేయలేరు కదా.చిన్న చిన్న స్థాయి పనులు కూడా చేసుకొని బ్రతుకుతుంటారు కదా.అలా అని వాళ్ళను అవమానించడం, చిన్న చిన్న కారణాలకే తమ తమ ప్రతాపం చూపించడం లాంటివి చేస్తే చాల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామానికి చెందిన కంటే రమేష్ అనే వ్యక్తి తన కొత్త ఇంటిని నిర్మించుకునే క్రమంలో గోడకు నీళ్ళు పడుతుండగా నీటి చుక్కలు తన ఇంట్లో పడ్డ కారణంతో నీళ్ళు పట్టిన కంటే రమేష్ అనే వ్యక్తి ని పద్దెనిమిది గంటల పాటు నిర్భందించి కర్రలతో కొడుతూ చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది.
అయితే ఇలా వారు చేస్తున్న క్రమంలో చుట్టూ ప్రక్కల వారు నిలువరించడానికి ప్రయత్నించినా వారు వినలేదని బాధితుడు చెబుతున్న మాటలు నెటిజన్లను కదిలించాయి.పోలీసులకు ఫోన్ చేయడానికి ఎంతగా ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదని బాధితుడు చెబుతున్నాడు.
ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు ఆక్షేపనీయం.నెటిజన్లు ఈ ఘటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి ఘటనలు చాలా దురదృష్టకరమని ఇటువంటివి జరిగినప్పుడు పోలీసుల కంటే ముందు చుట్టు ప్రక్కల వారు స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.ఏది ఏమైనా చివరికి పోలీసులు వచ్చి బాధితుడిని విడిపించి ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది.
ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారడమే కాదు అత్యవసర సమయంలో పోలీసులు స్పందించకపోవడంతో పోలీసులపై నెటిజన్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు
.