శునకాల తర్వాత ఎక్కువగా పెంచుకునేది పిల్లులనే.కొంతమంది శునకాలు, పిల్లులను రెండిటిని పెంచుకుంటారు.
తమకిష్టమైన బ్రీడ్ లను ఎంచుకుని లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి పిల్లులను, శునకాలను కొనుగోలు చేసే భారతీయులు చాలామంది ఉన్నారు.అయితే హైదరాబాద్ లోని చార్మినార్కు చెందిన అద్నాన్ అనే ఒక వ్యక్తి ఒక అరుదైన, చాలా ఖరీదైన పిల్లి ని కొనుగోలు చేశారు.
ఐతే ఈ పిల్లి నెక్లెస్ రోడ్ లో ప్రత్యక్షం కాగా చాలామంది ఆశ్చర్యపోతూ ఫోటోలను తీశారు.పెట్ షాప్ నుంచి ఏడు నెలల క్రితమే ఈ పిల్లి ని హైదరాబాద్ వాసి అద్నాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ పిల్లి కళ్ళు రెండు రంగులలో ఉండటమే దాని లోని ప్రత్యేకత.ఎడమ కన్ను గోధుమ కలర్ లో ఉంటే.కుడి కన్ను తెలుపు నీలి కలర్ లో ఉంటుంది.కళ్ళు తప్ప మిగతా శరీరం అంతా కూడా తెలుపు కలర్ లో ఉంటుంది.
పర్షియన్ జాతికి చెందిన ఈ పిల్లులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.అందుకే అవి చాలా ధర పలుకుతాయి.
దాదాపు 10-17 ఏళ్ల పాటు జీవించగల ఈ పిల్లులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.అయితే రెండు కళ్ళ వేరువేరు వర్ణాల్లో ఉన్న పర్షియన్ జాతి పిల్లులు క్యాట్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.
ప్రస్తుతం ఈ రంగు కళ్ళ సుందరి ఫోటోలు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి.ప్రముఖ పత్రికలతో పాటు డిజిటల్ మీడియాలో కూడా ఈ విభిన్న రంగు కళ్ళు కలిగిన పిల్లి గురించి కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే ఈ పిల్లులకు ప్రత్యేకమైన ఇన్ స్టాగ్రామ్, ఫేసుబుక్, ట్విట్టర్ పేజీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్, హిమాలయన్ క్యాట్స్ కూడా బాగా ఆదరణ పొందాయి.వీటిని కూడా ఇండియన్ దేశస్తులు కొనుగోలు చేస్తుంటారు.