భారతీయ సంప్రదాయాలను మన భారతీయులు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.మన సంప్రదాయాల వెనుక ఎన్నో రకాలైన అర్ధాలు దాగి ఉన్నాయి.
అలాగే హిందువులు గోమాతను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఆవుకు పూజ చేయడం, ఆవు పేడతో గొబ్బిళ్ళు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఆవు పేడ, ఆవు మూత్రంలో రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.ఆవు మూత్రాన్ని కూడా చాలా పవిత్రంగా భావించి తాగేవారు కూడా ఉన్నారు.
కానీ సైన్స్ మాత్రం ఇలా చేయడం సరైన పద్ధతి కాదని భిన్న వాదనను వినిపిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ భిన్నవాదనను ఖండిస్తూ ఆవు పేడ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అని తెలిపే క్రమంలో లైవ్ వీడియోలోనే ఆవు పేడ తిని అందరిని ఆశ్చర్య పరిచాడు.
ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఆ వీడియో పట్ల నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరి ఆ డాక్టర్ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా.హర్యానాలోని కర్నాల్ సిటీకి చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ అక్కడ బాగా పాపులర్ చైల్డ్ స్పెషలిస్ట్.
అలాగే డాక్టర్ మనోజ్ కు కర్నాల్ లో ఒక పెద్ద క్లినిక్ కూడా ఉంది.ఎప్పుడు కూడా రోగులతో బిజీబిజీగా ఉంటుంది ఆ హాస్పిటల్ మొత్తం.
ఎంత ఎంబీబీఎస్, ఎండీ చేసి డాక్టర్ వృత్తిలో రాణిస్తున్నాగాని తన విశ్వాసాలను మాత్రం మర్చిపోలేదు.ఒక పక్క హాస్పిటల్ రన్ చేస్తూనే మరో పక్క గోశాలను కూడా నిర్వహిస్తుంటారు.
గోశాలలో ఉన్న ఆవులు అంటే ఆయనకు మక్కువ ఎక్కువ.
ఎంతో మమకారంగా వాటిని చూసుకుంటూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే తన దగ్గరకొచ్చే వారికి ఆవు యొక్క గొప్పతనాన్ని, ఆవు పాలు, మూత్రం, పేడ వల్ల కలిగే లాభాలను చెప్తూ ఉంటారు.ఆ క్రమంలో ఒక లైవ్ వీడియోలో ఆవు గురించి మాట్లాడుతూ.
ఆవు పేడను చేతిలోకి తీసుకుని తినేశారాయన.అలాగే ఆవు పేడ అనేది తన మనసును, మెదడును, ఆత్మను పరిశుద్ధం చేస్తుందని చెప్పారు డాక్టర్ మనోజ్ మిట్టల్.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ఆవు పేడను తినాలని, గోమూత్రాన్ని తాగాలని తెలిపారు.అంతేకాకుండా గర్బిణిలు ఆవు పేడ తింటే సిజేరియన్ అవసరం లేకుండానే నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ మనోజ్ వివరించారు.
ఒక డాక్టర్ అయిన కానీ ఇలాంటి పని చేయడం ఏంటి నెటిజన్లు షాక్ అవుతున్నారు.