పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు వూహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట.ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్ లు, షామియానాలు, కిరాయికి ముత్తైదువులు, కాంట్రాక్టు వంటకాలు, పెళ్లి ప్యాకేజి పేరు తో అంతా అరువు తెచ్చుకున్న మనుషులు కానే కాదు.
తాటాకులతో పందిరి వేయాలి.మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి.
అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి .పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ.రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం.కొన్ని వేల మంది బంధుమిత్రులు దశాబ్దాల తర్వువాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ఆత్మీయ ముచ్చట్లు ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే.
అయితే కరోనా కాలంలో పెళ్లిళ్ల సందడే లేకుండా పోయింది.వివాహాది శుభకార్యక్రమాలకు 50 మందికి మించి హాజరవ్వకూడదని ప్రభుత్వం గట్టిగా చెప్పడంతో ఎందుకొచ్చిన తంటా అని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
మేళతాళాలు లేవు, ఆకాశమంత పందిళ్లు లేవు, బారాత్లులేవు.
ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది.
సాధారణంగా పెళ్లి తతంగంలో పెళ్లికూతురుతో చాలా సార్లు పెళ్లి కొడుకు కాళ్లు మొక్కిస్తారు.అయితే ఇక్కడొక పెళ్లి వేడుక మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది.పెళ్లి కూతురు కాళ్లమీద పెళ్లి కొడుకే పడ్డాడు.కాళ్లు మొక్కాడు.వధూవరులు దండలు మార్చుకుంటున్న సమయంలో వరుడు అకస్మాత్తుగా వధువు కాళ్ల మీద పడ్డాడు.ఈ తతంగాన్ని చూసి పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు ఆశ్చర్యపోయారు.ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు.అయితే తాను ఎందుకు పెళ్లికూతురు కాళ్లు మొక్కానో పెళ్లికొడుకు సవివరంగా చెప్పుకొచ్చారు.
తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి మెట్టినింటికి వస్తున్నారు కాబట్టే ఆమె కాళ్లకు దండం పెట్టానన్నాడు.కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి తన కోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు మొక్కితే తప్పేముందని అడుగుతున్నాడు.నిజమే కదూ! పుట్టినింట్లో అనుభవించిన అన్నేళ్ల ప్రేమాప్యాతలను వదిలేసి మెట్టినింట అడుగుపెడుతున్నందుకు ఆమె కాళ్లు మొక్కినా తప్పులేదనంటున్నారు చాలా మంది.పెళ్లికొడుకు పెళ్లికూతరు కాళ్ల మీద పడిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నెటిజన్లు చాలా మంది పెళ్లికొడుకు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.