ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఎప్పటికి అప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్టే తెలిసిపోతుంది.
సోషల్ మీడియాలో మనము ఈ మధ్యకాలంలో జంతువులు, పక్షులు, వన్య ప్రాణులకూ సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ప్రపంచంలో అమ్మ విలువ వెలకట్టలేనిది ఏదీ లేదు.
ఈ తరుణంలో తాజాగా ఒక ఏనుగు తన తల్లి ప్రేమను వ్యక్త పరుస్తున్న క్రమంలో తన బిడ్డ ప్రాణాల కోసం రైలుకు అడ్డంగా నిలబడి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర బెంగాల్ లోని పంటపొలాల్లోకి ఒక ఏనుగుల గుంపు చొచ్చుకొని వచ్చింది.
ఈ ఏనుగుల మందను గంగా అనే ఏనుగు ముందుండి నటించడం మొదలు పెట్టింది.ఈ గుంపుల మంద పంట పొలాల్లోకి వచ్చిందని విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆ ఏనుగుల గుంపును వారు తరిమేశారు.
ఈ క్రమంలో ఏనుగుల మంద మొత్తం ఒక రైల్వే క్రాస్ వద్దకు చేరుకోవడంతో.అందులో ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు మొత్తం పట్టాలు చాలా సులువుగా దాటేశాయి.
కానీ, గంగా ఏనుగు బిడ్డ మాత్రం ఆ పట్టాలు క్రాస్ చేయలేక పోయింది.ఈ క్రమంలో అక్కడికి మరో రైలు రావడంతో పిల్ల ఏనుగు ప్రాణాలకు ప్రమాదం ఉండడంతో, అది గమనించిన తల్లి ఏనుగు ఒక్క సరిగా మళ్లీ పట్టాలపైకి వచ్చేసింది.
ఈ లోపు ఆ రైలు అక్కడికి చేరుకోవడంతో బిడ్డను తప్పించబోయే క్రమంలో గంగా ఏనుగును రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కానీ, పిల్ల ఏనుగు మాత్రం ప్రాణాలతో బయట పడింది.
ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ఆ సంఘటన వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
ప్రముఖ జీవ పరిరక్షణ శాస్త్రవేత్త ఒకరు సోషల్ మీడియా వేదికగా గంగా ఏనుగు, పిల్ల ఏనుగు సంబంధించిన పిల్లల ఫోటోలతో పాటు కథనాన్ని మొత్తం పోస్ట్ చేస్తూ మన కుటుంబాల కోసం చనిపోతామని మనం అంటుంటాం.
అయితే ఏనుగులు వాస్తవంగా చేస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గంగా ఏనుగు చేసిన ఈ సాహసానికి నెటిజన్స్ అందరూ ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.