ఇలాంటి సంఘటనలు అరుదుగా జరిగినప్పయికీ ఇదో ఆశ్చర్యపోవాల్సిన ఘటనగానే పరిగణించవచ్చు.ఓ వ్యక్తి.
తన తమ్ముడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే.ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
అతడ్ని పరీక్షించిన డాక్టర్లు.అవసరమైన టెస్టులు చేయించాలని సిఫార్సు చేయడంతో సదరు వ్యక్తి తన తమ్ముడికి అల్ట్రాసౌండ్, ఎక్స్రే స్కానింగ్, ఎండోస్కోపీ లాంటి టెస్టులు చేయించాడు.అనంతరం వచ్చిన రిపోర్ట్స్ను డాక్టర్స్కు చూపించాడు.కట్ చేస్తే స్కానింగ్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు ఒక్కసారిగా బిత్తరబోయారు.
వివరాల్లోకి వెళ్తే, బుర్హాన్ డెమిర్ అనే వ్యక్తి.తన 35 ఏళ్ల తమ్ముడు తీవ్రమైన కడుపు నొప్పి ఉందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
అతడికి వైద్యులు కొన్ని పరీక్షలు చేయించాలని సిఫార్సు చేయడంతో.ఆయా టెస్టులన్నీ చేయించాడు డెమిర్.
ఆ తరువాత వచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ చూసి డాక్టర్లకు మతి పోయింది.విషయం ఏమంటే, రోగి కడుపులో నాణేలు, రాళ్లు, మేకులు, గాజు ముక్కలు.
లాంటివి గుట్టలు గుట్టలుగా ఉండటంతో చూసి ఆశ్చర్యపోయారు.
ఇకపోతే, అవి కడుపులోకి ఎలా చేరాయో తెలియక డాక్టర్లు మతిపోయింది.ఈ విషయమై సదరు రోగి అన్నను దీని గురించి ప్రశ్నించగా.తన తమ్ముడికి ఇలా వస్తువులను మింగే అలవాటు ఎప్పటినునుందో ఉందని చావు కబురు చల్లగా చెప్పాడు.
దాంతో డాక్టర్లు వారిరువురికి దెబ్బలాడి వెంటనే రోగికి ఆపరేషన్ చేసి.ఆ వస్తువులను బయటికి తీశారు.అతగాడి పొట్టలో ఓ గానిలాగా తీసేకొద్దీ మరిన్ని బయటపడం చూసి ఖంగు తిన్నారు.బయటకి తీసిన తరువాత వాటన్నిటిని టేబుల్పై పేర్చగా.
మొత్తం 233 వస్తువులు బయటపడ్డాయి.