తాజాగా జరిగిన మిస్సెస్ శ్రీలంక 2020 పోటీల్లో జరిగిన నాటకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిన విషయమే.శ్రీలంక దేశపు రాజధాని కొలంబోలో జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ కార్యక్రమంలో మిస్సెస్ శ్రీలంక గా ఎన్నికైన మహిళపై ఉన్న కిరీటాన్ని తీసేసి ఆమెపై ఆరోపణలు చేసి న్యాయనిర్ణేతలు చెప్పిన మహిళను కాకుండా మొదటి రన్నరప్ కి కిరీటం తొడిగి నానా హంగామా సృష్టించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా స్టేజ్ మీద మిస్సెస్ శ్రీలంకను అవమానించి గందరగోళం సృష్టించిన మాజీ మిస్సెస్ శ్రీలంక కరోలినా ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో మాజీ మిస్సెస్ శ్రీలంక తన పరువు తానే తీసుకున్నట్లు అయింది.
తాజాగా జరిగిన పోటీలలో న్యాయనిర్ణేతలు పుష్పిక అనే మహిళ విజేతగా ప్రకటించిన తర్వాత.2019 సంవత్సరంలో మిస్సెస్ శ్రీలంక గా గెలిచిన కరోలినా జ్యూరీ మాట్లాడుతూ న్యాయనిర్ణేతలు నిర్దేశించిన ఆవిడ ఈ కిరీటానికి అర్హులు కాదని, ఆ విడాకులు తీసుకుందని మిస్సెస్ శ్రీలంక విజేతగా ఆమె కిరీటాన్ని ధరించడానికి అర్హులు కాదంటూ ఆమెకు ఇచ్చిన కిరీటాన్ని తలపై నుండి లాగేసి మొదటి రన్నరప్ తలపై పెట్టి అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం గొలిపేలా ప్రవర్తించింది.దీంతో విజేతగా నిలిచిన పుష్పిక జరిగిన సంఘటనతో కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత విజేత పుష్పిక స్పందిస్తూ తాను విడాకులు తీసుకోలేదని కేవలం తన భర్తకు దూరంగా ఉంటుందని తెలియజేసింది.
దీంతో అనుచితంగా ప్రవర్తించిన ఆవిడ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆవిడ కోరింది.ఒకవేళ అ తన పై వేసే నిందలు నిరూపించాలంటే నా విడాకుల పత్రాలు అందరికీ చూపించాలి అంటూ ఆవిడ సవాల్ విసిరింది.అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా న్యాయనిర్ణేతలు విజేత పుష్పిక అని తెలిపి ఆమె కిరీటం ఆమెకు ఇచ్చేస్తామని తెలపడంతో పాటు ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని జ్యూరీ పేర్కొంది.
అయితే ఈ సంఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ప్రాథమిక విచారణ జరిపి కరోలినా ను అదుపులోకి తీసుకున్నారు.అయితే తనను స్టేజ్ మీద అంతగా అవమానించిన కరోలినా తనకు బహిరంగంగా క్షమాపణ చెబితే తాను కేసు వాపస్ తీసుకుంటానని చెప్పింది పుష్పిక.
అయితే తాను చేసింది మాత్రం కరెక్ట్ అని తాను ఎటువంటి పరిస్థితిలో క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పడంతో ప్రస్తుతం ఇరువురు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు.చూడాలి మరి మొత్తానికి న్యాయం ఎటువైపు వస్తుందో.