ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.కరోనా దెబ్బకు సామాన్యులు మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది.
తమ తోటి వారు కరోనాతో మృతి చెందుతూ ఉంటే మానసికంగా అందరూ భయందోళన చెందుతున్న పరిస్థితి ఉంది.అయితే ఈ సమయంలోనే అరేబియా సముద్రంలో అల్పపీడనంతో అది కాస్తా తౌక్తా తుఫాన్ గా మారింది.
ఇక ఒక్కసారి తుఫాను హెచ్చరిక మొదలైనప్పటి నుండి తుఫాను తీవ్రతను బట్టి ప్రజలు రక్షణ దృష్ట్యా రకరకాల హెచ్చరికలు జారీ చేస్తారు.అయితే తుఫాను ధాటికి ఏవైనా కూలిపోవాల్సిందే.
తాజాగా ఈ తుఫాను ప్రభావంతో ఒక్కసారిగా రెండొస్తుల భవనం ఒక్కసారిగా కుప్ప కూలింది.కాని అదృష్టవషాత్తు సమయానికి ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ ఘటన తుఫాను తీవ్రతను సూచిస్తున్నదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం కేరళలో తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుందో లేదో మనం ఇప్పటికిప్పుడు చెప్పలేం.ఇప్పడు ఒకవేళ ఈ తుఫాను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తే ప్రజలకు మరొక నష్టం తప్పదనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.
ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.