తమిళనాడు రాష్ట్రంలో కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ “ఇడ్లీ అమ్మ” గా పేరు సొంతం చేసుకున్న కమలాథల్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అనుకొని గిఫ్ట్ అందజేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అతి త్వరలోనే కమలాథల్ కు ఒక హోటల్ ను నిర్మించి ఇవ్వబోతున్నట్లు తెలియచేశారు.
అందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిందని, రిజిస్ట్రేషన్ కు సహకరించిన రెవెన్యూ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఆనంద్ మహేంద్ర.
రెండు సంవత్సరాల కిందట రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్ గురించి సోషల్ మీడియాతో పాటు ప్రధానం మీడియాలో వచ్చిన కమలాథల్ కథనాలు గురించి తెలుసుకొని ఆశ్చర్యానికి గురి అయ్యారు ఆనంద్ మహేంద్ర.
ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని కూడా తెలియజేశారు.కట్టెల పొయ్యి తో వంట చేయడం చూసి ఆమెకు ఎల్పిజి గ్యాస్ అందజేస్తున్నట్లు ఆనంద్ మహేంద్ర హామీ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో కమలాథల్ కోసం కోయంబత్తూరు లోని ఒక ఇల్లు నిర్మించి బహుమానంగా ఇచ్చేందుకు ఆనంద్ మహేంద్ర తగిన చర్యలు చేపడుతున్నట్లు, నిర్మాణానికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ పత్రాలు ఆమెకు అందచేశారు.ఇక కమలాథల్ కోసం నిర్మిస్తున్న ఇంటిని మహేంద్ర లైఫ్ స్పేసెస్ నిర్మాణం చేపట్టబోతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబందించిన కధనం సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.