సోషల్ మీడియా నానాటికీ విస్తరిస్తూ పోతోంది.స్మార్ట్ ఫోన్స్ సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఇపుడు ఎలాంటి వార్తలైన సోషల్ మీడియా ద్వారానే మనిషి తెలుసుకోగలుగుతున్నాడు.
ఈ క్రమంలో నిత్యం అనేక వీడియోలు అక్కడ వైరల్ అవుతుండటం మనం చూస్తూ వున్నాం.అందులో ముఖ్యంగా ఏ కొన్నో వైరల్ అవుతుంటాయి.
ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి.మనుషులకు, పెంపుడు శునకాలకి వున్న బంధం ఈనాటిది కాదు.
ఇక కొంతమందైతే పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు.ఆమధ్య కన్నడలో రిలీజైన ‘777 చార్లి’ సినిమా మీరు చూసే వుంటారు.ఆ సినిమా మనుషులకు, శునకాలకు మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ఉదాహరణగా తెరకెక్కిందని చెప్పొచ్చు.అనారోగ్యం బారిన పడిన తన పెంపుడు శునకానికి స్నో ఫాల్ చూపించేందుకు ఒక వ్యక్తి చేసిన ప్రయాణమే ఇతివృత్తంగా సాగిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
విశ్వాసం చూపడంలో కుక్కలు మనుషులను మించిపోతాయనేది నూటికి నూరుశాతం వాస్తవం.
అందుకే అనేకమంది పెంపుడు జంతువులకు అగ్ర తాంబూలం అందిస్తూ వుంటారు.తాజాగా ఈ విషయాన్ని ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో రుజువు చేస్తోంది.ఓ వ్యక్తి తన వివాహా వేడుకకు హాజరుకావడానికి పెళ్లి మండపానికి బైక్పై తన పెంపుడు శునకాన్ని తీసుకెళ్లడం ఇక్కడ ప్రత్యేకంగా నిలిచింది.
ఆ శునకం కూడా ఇక్కడ పెళ్లికొడుకులాగా ముస్తాబవడం కొసమెరుపు.పెళ్లికి హాజరైన వాళ్లు దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.