పరమ శివుడు.నిత్యం చైతన్య స్వరూపుడై భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు.
అదే పరమశివుడు కళ్ళ ముందుకు వచ్చి శివ తాండవం చేస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.తాజాగా ఒక ప్రాంతంలో మాత్రం శివుడు ఉగ్రరూపంతో నాట్యం చేశాడు.
ఈ శివుడి విగ్రహం ఏకంగా 24 అడుగుల ఎత్తు ఉంది.
ఇలా కళ్ళ ముందే శివతాండవం, కన్నుల పండుగ చేసే శివుని నాట్యం భక్తులను అందరిని పరవశింప చేస్తుంది.
ఇంతకి ఈ శివతాండవం చేస్తున్న విగ్రహం ఎక్కడ అని అనుకుంటున్నారా.? ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది.మనం సాధారణంగా అనేక రకాల శివుని విగ్రహాలు చూసి ఉంటాం.కానీ, ఈ రోబోటిక్ శివుడి విగ్రహం చాలా అరుదు.ఇది సాధారణమైన విగ్రహం కాదు.ఇది ఒక ప్రత్యేకమైన రోబోటిక్ విగ్రహం.
అంతేకాకుండా ఈ రోబోటిక్ శివుని విగ్రహం మాత్రం కాళ్ళు, చేతులు కదిలిస్తూ నాట్యం చేస్తుంది.
నాట్యం చేస్తున్న రోబోటిక్ విగ్రహం చూసి ప్రజలందరూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.
ఒంగోలు నగర వీధులలో 24 ఆ విగ్రహాన్ని పలు వీధులలో ఊరేగింపు యాత్ర నిర్వహించారు ఆలయ సిబ్బంది వారు.ఈ రోబోటిక్ సివిల్ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
ఈ రోబోటిక్ శివుడి విగ్రహం కేరళ నుంచి ప్రత్యేకంగా తెపించినట్లు ఆలయ సిబ్బంది తెలిపింది.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.కేరళ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ విగ్రహాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో ప్రవేశపెట్టామని తెలియజేశారు.