ఆన్లైన్ షాపింగ్ లో మనకు అప్పుడప్పుడు ఎన్నో వింతలు, వివేషాలు కనపడుతూ ఉంటాయి.వస్తువుల ధరల్లో ఒక్కో ప్లాట్ ఫామ్లో ఒక్కో ధరలు కనిపిస్తూ ఉంటాయి.
ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం కూడా మనం అనేకం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆన్లైన్ లో కొన్ని వస్తువుల ధరలు మనల్ని షాక్ కు గురిచేస్తుంటాయి.వస్తువులు ఒక ప్లాట్ ఫామ్ లో ఒకరేటు ఉంటే, మరో ప్లాట్ ఫామ్ లో ఇంకో రేటు ఉంటుంది.
ఇదే క్రమంలో తాజాగా గుస్సి అనే ఇటాలియన్ ఫ్యాషన్ హౌజ్ ప్లాట్ఫామ్ భారతీయ యువతులు ఇష్టపడే కుర్తా పైజామాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.ఇక్కడే అసలు ట్విస్టు జరిగింది.
అసలు ఈ కుర్తాను మన ఇండియాల వీధి వ్యాపారుల వద్ద అయితే కేవలం రూ.100కే అమ్ముతారు.కానీ వీటి ధరను గుస్సీ కంపెనీ మాత్రం భారీగా నిర్ణయించింది.ఒక కుర్తా ధర ఏకంగా 2100 డాలర్లుగా ఉంది.
భారతీయ కరెన్సీలో దీని ధర అక్షరాలా లక్షన్నరకు పైగానే ఉంటుందని తెలుస్తోంద.ఇ ఇందులో ఖరీదైన మోడల్ కావాలి అంటే 3500 డాలర్లు చెల్లించాల్సిదే దీని రేటు భారతీయ కరెన్సీలో రూ.2.5లక్షలకు పైమాటే అన్నమాట.దీంతో ఈ ధరలను చూసిన మన ఇండియన్ నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.మా దగ్గర వీధి వ్యాపారుల దగ్గర చీప్గా దొరికే వాటిని లక్షల్లో అమ్ముతున్నారంటూ మండిపడుతున్నారు.
ఇక మరి కొందరు నెటిజన్లు అయితే చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ డ్రెస్ వీధి వ్యాపారుల దగ్గర రూ.100 కే దొరుకుతుందని కొందరు అంటే ఐదు వందలకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వమని ఇంకొందరు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.మా ఇండియన్లు అయితే వీటిన రూ.250కి కొనడానినికి కూడా వెనకడుగు వేస్తారు అలాంటిది అక్కడ లక్షల్లో ఎలా కొంటున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.