టాలీవుడ్ దర్శకుడు విప్లవ్ అనారోగ్యంతో చనిపోయాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.జగపతిబాబు ‘హితుడు’ సినిమాకు దర్శకుడిగా చేసిన విప్లవ్ అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు అని, ఆ అనారోగ్యం కారణంగానే నిన్న రాత్రి కన్నుమూశాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలు పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.
తాను బతికే ఉన్నాను అంటూ దర్శకుడు విప్లవ్ ఫేస్బుక్ ద్వారా ప్రకటించాడు.
గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవమే కాని, తాను చనిపోలేదు బాబోయ్ అంటూ ఈయన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.ఇలాంటి పుకార్లు ఎలా పుట్టాయో అనే అనుమానంను వ్యక్తం చేశాడు.
మీడియా వారు ఒక మనిషి బతికి ఉండగానే ఇలా విచారించకుండానే చనిపోయాడు అంటూ కథనాలు రాయడం ఎంత వరకు కరెక్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది.