తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.వరుస సెలవులు రావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరుతున్నారు.
ప్రతి రోజు వేలాదిగా భక్తులు తరలివస్తుండగా.సర్వ దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.
ఈ క్రమంలోనే తిరుమల కొండపై కొందరు ఏపీ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది.అయితే, నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం చేయించారు.
దీంతో గంటకు పైగా సాధారణ భక్తులు ఇబ్బందులు పడ్డారు.టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రేక్ దర్శనం చేయించారని మంత్రి రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే మంత్రి ఉషాశ్రీ చరణ్ కూడా ఇదే విధంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.