పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని క్రిష్ తెరకేక్కిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో భాగం కానున్నాడు.
మొఘలాయిల కాలం నాటి ఇతివృత్తంతో ఈ సినిమాని క్రిష్ ఆవిష్కరిస్తున్నాడు.ఇక ఇందులో బందిపోటు దొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.
నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నెగిటివ్ షేడ్స్ విలనీగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ ని ఈ సినిమా కోసం ఎంచుకోవడం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేయిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
మొఘలాయిల కాలాన్ని ప్రతిబింబించే విధంగా అప్పటి చార్మినార్ కట్టడం, అక్కడి చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా ఉండేదో అదే రకమైన ప్రెజెంటేషన్ తో ఈ చార్మినార్ సెట్ ఉండబోతుందని టాక్ నడుస్తుంది.దీనికోసం క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేయిస్తున్నట్లు సమాచారం.
చార్మినార్ వైభవాన్ని ఈ సినిమాలో క్రిష్ చూపించాబోతున్నాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఏంఏం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం అయ్యప్పన్ రీమేక్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో వీరమల్లు కోసం జాయిన్ అయ్యే అవకాశం ఉంది.