టాలీవుడ్ హీరో వినోద్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
మొదట మౌన పోరాటం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఆ తరువాత వచ్చిన మామగారు, కర్తవ్యం, సీతారత్నం గారి అబ్బాయి, అమ్మ నా కోడలా ఇలాంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచు కున్నాడు.
తెలుగు సినిమాలలో మామగాడు సినిమాకు గాను వినోద్ కి నంది అవార్డు కూడా లభించింది.
వినోద్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం,కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇలా ఉంటే తాజాగా వినోద్ కుమార్ ఆలీతో సరదాగా షో కి హాజరయ్యాడు.ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
హీరోయిన్ ఆమని తో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ లో అక్కడే ఉన్న తన భార్య చూడలేక సిగ్గుతో అక్కడి నుంచి లేచి వెళ్ళి పోయింది అని చెప్పుకొచ్చాడు.నటుడు సాయికుమార్ తన కర్తవ్యం సినిమా నుంచి పరిచయమని తెలిపారు.
అయితే తనకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం లేదని ఒకసారి కొట్టాలి అనుకున్నాను అని సరదాగా అన్నారు వినోద్ కుమార్.మోహన్ గాంధీ, దాసరి, కోడి రామకృష్ణ అలాంటి దర్శకులతో సినిమాలు చేయడం అదృష్టం అని తెలిపారు.అదే విధంగా కెరీర్ లో ఎన్నో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ చివర్లో ఎమోషనల్ అయ్యాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.