బాలీవుడ్లో ప్రస్తుతం తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి.కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు లో బడ్జెట్తో తెరకెక్కి సక్సెస్ అయిన సినిమాలను కూడా అక్కడ రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సౌత్ సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చిన్నా చితకా సినిమాలను అక్కడ రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం పొందాలని కొందరు ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు.అందుకే వరుసగా చిన్న సినిమాలను కూడా అక్కడకు తీసుకు వెళ్తున్నారు.
కృష్ణుడు హీరోగా సోనియా, పూనం హీరోయిన్స్గా నటించిన చిత్రం వినాయకుడు.ఒక లావుగా ఉండే అమాయకపు వ్యక్తి కథతో రూపొందిన వినాయకుడు చిత్రంకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
అద్బుతమైన రెస్పాన్స్ ఇవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.అందుకే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
తెలుగులో దర్శకత్వం వహించిన సాయి కిరణ్ అడవి హిందీలో రీమేక్కు దర్శకత్వం వహిస్తాడట.ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థను ఈ సినిమా నిర్మాణంలో భాగం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడట.కృష్ణుడు పోషించిన పాత్రను అక్కడ ఎవరు పోషిస్తారు అనేది చూడాలి.అక్కడ ఆ స్థాయిలో లావు ఎవరు ఉండి ఉంటారు అనేది చర్చ జరుగుతోంది.వినాయకుడు సినిమాను అక్కడ కూడా తక్కువ బడ్జెట్తో నిర్మించాలని భావిస్తున్నారు.అయితే కాస్టింగ్ పరంగా కాస్త రిచ్ లుక్ను తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే బాలీవుడ్ వినాయకుడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.