అగ్ర రాజ్యం అమెరికాకు వలసలు వెళ్ళిన వారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.అందులోనూ తెలుగు వారి సంఖ్య రెండవ స్థానంలో ఉంటుంది.
ఎంతో మంది తెలుగు వారు అమెరికాలో ఎంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు కూడా.అక్కడ ప్రాంతాల వారిగా, బాషల వారిగా పలు తెలుగు సంఘాలు ఉన్నా, అందరూ ఎంతో సంతోషంగా భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను, తెలుగు పండుగలను ఘనంగా నిర్వహించుకుంటారు.
ఈక్రమంలోనే వినాయక చవితి పండుగను అమెరికాలోని కాలిఫోర్నియాలోని తెలుగు కుటుంబాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాయి.
అమెరికాలోని ఉన్న తెలుగు సంఘాలలో ఒకటైన ఫ్రీమోంట్ యూత్ అసోసియేషన్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
తెలుగు పండుగలు నిర్వహించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేయడం, స్థానికంగా ఉండే తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది.తెలుగు వారు ఎంతో సంతోషంగా, జరుపుకునే గణనాదుడి వినాయక చవితిని ఫ్రీమోంట్ యూత్ అసోసియేషన్ ఎంతో వైభవంగా నిర్వహించింది.
స్థానికంగా ఉన్న తెలుగు వారందరికీ గణేశుడి పూజలు అందించేందుకు భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసింది.
కరోనా నుంచీ ప్రజలను కాపాడాలని , ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని, ఈ ఏడాది ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు వినాయకుడు ఇవ్వాలని సంస్థ సభ్యులు గణపతిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియాలో ఉన్న దాదాపు 40 తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.అలాగే పలువురు భారతీయ కుటుంబాలు సైతం గణనాధుడిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి సంస్థ సభ్యులు పాల్గొన్నారు.